'భరత్ అనే నేను' విజయోత్సవ వేడుకకు రంగం సిద్ధం
- April 24, 2018సూపర్ స్టార్ మహేష్ బాబు, కైరా అద్వాని జంటగా నటించిన 'భరత్ అనే నేను' సినిమా బ్లాక్బస్టర్ దిశగా దూసుకుపోతోంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా అదరగొట్టేశాడు. మహేష్ నటన, దేవి శ్రీ సంగీతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా అంచనాలను మించి పరుగులు పెడుతోంది.
భారీ కల్లెక్షన్స్తో కొత్త రికార్డుల దిశగా దూసుకుపోతున్న ఈ సినిమా పట్ల పలువురు సినీ ప్రముఖులు సైతం తమ నీరాజనాలు తెలిపారు. ఓ వైపు కలెక్షన్ల సునామీ, మరోవైపు సినీ ప్రముఖుల ప్రశంసలతో చిత్ర యూనిట్ ఆనందంలో మునిగి తేలుతోంది. ఇచ్చిన హామీ నెరవేర్చామని తెగ సంబర పడుతున్న టీమ్.. 'భరత్' విజయోత్సవ వేడుక చేసేందుకు సిద్ధమయ్యారు.
ఈ వేడుకకు తిరుపతి వేదిక కానుంది. తిరుపతిలోని అలిపిరి రోడ్లో ఉన్న నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్స్లో ఏప్రిల్ 27వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఈ వేడుక ప్రారంభం కాబోతోంది. ఈ మేరకు కొద్దిసేపటిక్రితమే అఫీషియల్ ప్రకటన బయటకు వచ్చింది.
తాజా వార్తలు
- అబుదాబి పోలీసుల అలెర్ట్..అలా చేస్తే 1,000 దిర్హామ్ ఫైన్
- ఈద్ వేడుకల్లో అపశృతి.. 38 మందికి గాయాలు
- పాలస్తీనా శరణార్థులకు యుఎన్ఆర్డబ్ల్యుఎ మద్దతు
- తుఫాను ప్రభావిత ప్రాంత నివాసితులకు శుభవార్త..!
- NRIలకు IFSCA పెట్టుబడి అవకాశాలపై సెమినార్
- ఖతార్ సరిహద్దులో భారీగా ఆయుధాలు స్వాధీనం
- సోషల్ మీడియాలో విమర్శలు.. ఉపాధ్యాయుడికి జరిమానా
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..