JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- April 26, 2024
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్ 2024 సెషన్ 2 పేపర్ 1 (బీటెక్, బీఈ ) అసెస్మెంట్ ఫలితాలను విడుదల చేసింది. జేఈఈ అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్ (http://jeemain.nta.nic.in)లో యాక్సెస్ చేయవచ్చు.
ఈ ఏడాది మొత్తం 56 మంది అభ్యర్థులు 100 పర్సంటైల్ సాధించారు. వారిలో 22 మంది తెలుగు విద్యార్థులు 100శాతం స్కోరుతో సత్తా చాటారు. తెలంగాణ నుంచి 15 మంది, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి ఏడుగురు, ఢిల్లీ నుంచి ఆరుగురు, రాజస్థాన్ నుంచి ఐదుగురు చొప్పున ఉత్తీర్ణత సాధించారు. జాతీయ స్థాయిలో అత్యధిక స్కోర్ సాధించిన విద్యార్థుల్లో తెలుగువారే అధికంగా ఉండటం విశేషం.
పూర్తి స్కోరు సాధించిన 43 మంది విద్యార్థులు:
ముఖ్యంగా, ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలలో కర్ణాటకకు చెందిన సాన్వి జైన్, ఢిల్లీకి చెందిన షైన సిన్హా ఇద్దరు మహిళా అభ్యర్థులు పూర్తి స్థాయిలో స్కోర్ను సాధించారు. గతేడాదితో పోల్చితే.. 43 మంది అభ్యర్థులు పూర్తి మార్కులు సాధించారు. దాంతో ప్రీమియర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) కాలేజీల్లో ప్రవేశానికి అర్హత పరీక్ష అయిన జేఈఈ (అడ్వాన్స్డ్)కి కటాఫ్ భారీగా పెరగనుంది.
ఏప్రిల్లో జేఈఈ మెయిన్స్ రిజిస్ట్రేషన్లు:
జేఈఈ మెయిన్ 2024 ఏప్రిల్ సెషన్లో మొత్తం 1,179,569 మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకున్నారు. ఇందులో 806,045 మంది పురుషులు, 373,515 మంది మహిళలు, 9 మంది అభ్యర్థులు థర్డ్ జెండర్గా గుర్తించారు. వీరిలో 738,351 మంది పురుషులు, 329,600 మంది మహిళలు, 8 మంది ట్రాన్స్ జెండర్ అభ్యర్థులతో సహా 1,067,959 మంది అభ్యర్థులు పరీక్ష రెండవ సెషన్కు హాజరయ్యారు.
అదనంగా, 924,636 మంది అభ్యర్థులు ఈ సంవత్సరం జనవరి, ఏప్రిల్ సెషన్లకు రిజిస్టర్ చేసుకున్నారు. మొత్తంగా 822,899 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. గత జనవరి సెషన్లో 1,170,048 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఎన్టీఏ నివేదించిన ప్రకారం.. రెండు సెషన్లకు కలిపి 1,415,110 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- దుబాయ్ కార్మికులకు ఉచిత ఐస్క్రీమ్ పంపిణీకి యూఏఈ నివాసితులకు స్వచ్ఛంద సేవ చేసే అవకాశం
- పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు.. జండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ
- ఇరాన్ పై అమెరికా ముమ్మర దాడులు–వంతెనల ధ్వంసం, ఏడుగురు మృతి
- బహ్రెయిన్లో బోట్స్ రాకపోకలపై నిషేధం పొడిగింపు..!!
- సేఫ్ సిటీ ప్రాజెక్టు పై ఉన్నతస్థాయి సమీక్షించిన డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణలో మద్యం ధరల భారీ పెంపు
- కువైట్ పై మళ్లీ దాడులు..అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థ..!!
- వరల్డ్ కప్ ట్రోఫీ గెలిచిన జట్టుకు మరో అరుదైన గౌరవం
- ధోఫార్లో టూరిజానికి బూస్ట్.. ‘యోర్ పాత్ ఈజ్ గ్రీన్’ కు శ్రీకారం..!!
- సౌదీలో పీక్ సమ్మర్ పీరియడ్ ప్రారంభం..హెచ్చరికలు జారీ..!!







