24 గంటలపాటు అప్రమత్తంగా వుండాలి: ఐఎండీ
- April 24, 2018న్యూఢిల్లీ: ఆఫ్రికాలో ప్రచండ గాలుల ప్రభావంతో సముద్రంలో అలలు ఉప్పెనలా ఎగసిపడుతున్నాయి. వీటి ప్రభావంతో కేరళ తీరంలో 100 ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఆఫ్రికా గాలుల కారణంగా సముద్రంలో అలలు భారీగా విరుచుకుపడతాయని ప్రపంచ సునామీ హెచ్చరికల సంస్థ ఇన్ కాయిస్ పేర్కొంది. ఈ అలల ప్రభావం ఎక్కువగా భారత్ లోని తూర్పు, పశ్చిమ తీరాలపై ఉంటుందని ఇన్ కాయిస్ సంస్థ హెచ్చరించింది. సముద్ర తీర ప్రాంతంలో ఉండే వారు అప్రమత్తంగా ఉండాలని ఇన్ కాయిస్ హెచ్చరించింది. ఈ నెల 26వ తేదీ వరకూ ఈ ఆలలు ఎగిసిపడతాయని పేర్కొంది.
మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. అండమాన్ తీరం నుంచి భారత్ ప్రధాన భూభాగం వైపు అలలు వస్తున్నాయని, తమిళనాడు, ఏపీ, ఒడిశా, బెంగాల్ తీరాల్లో అలలు అలజడి సృష్టిస్తాయని ఆ సంస్థ పేర్కొంది. పశ్చిమ తీరంలో కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక తీరాల్లోని అలలు అలజడి సృష్టిస్తాయని అంది.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం
- టీడీపీ అభ్యర్థి టీ.జీ.భరత్ నామినేషన్ దాఖలు