జయ సమాధి తవ్వడం తప్పదా..?
- April 26, 2018జయలలిత తన తల్లినంటూ బెంగళూరుకు చెందిన అమృత అనే మహిళ దాఖలు చేసిన కేసు కీలక మలుపు తిరిగింది. అమృత పిటీషన్ ను పరిశీలించిన మద్రాస్ హైకోర్టు డీఏఎన్ పరీక్ష కోసం రక్తం వంటి బయాలాజికల్ (జీవ సంబంధిత) శాంపిల్స్ ఇవ్వాల్సిందిగా అపోలో హాస్పిటల్స్ ను ఆదేశించింది. తమ వద్ద జయలలితకు సంబంధించిన బయలాజికల్ శాంపిల్స్ ఏవీ లేవని హాస్పిటల్ కోర్టుకు తెలిపింది. చాలా రోజుల తరవాత హాస్పిటల్ దాఖలు చేసిన అఫడవిట్ ఇపుడు ఈ కేసులో కీలకంగా మారనుంది. ఆమెకు సంబంధించి ఎలాంటి నమూనాలు తమ వద్ద లేవని స్పష్టం చేయడంతో.. కోర్టు మున్ముందు ఇచ్చే ఆదేశాలపై ఉత్కంఠ నెలకొంది.జయ మృతికి సంబంధించి ఎలాంటి విచారణ వద్దని ఒకవైపు ఆమె అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సమాధి తవ్వి ఆమె అవశేషాలు తీసి పరీక్షలు నిర్వహించేందుకు కోర్టు ఆదేశిస్తుందా? అన్న టెన్షన్ ఆమె అభిమానుల్లో నెలకొంది.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్