షార్జాలో భారత మహిళ హత్య

- April 26, 2018 , by Maagulf
షార్జాలో భారత మహిళ హత్య

షార్జా:36 ఏళ్ళ మహిళను హత్య చేసి, పాతి పెట్టిన ఘటన షార్జాలో వెలుగు చూసింది. షార్జాలోని మైసలోన్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ భారతీయ కుటుంబం నివాసం వుంటోన్న ఇంట్లోనుంచి దుర్గంధం వస్తుండడంతో పోలీసులకు, ఇరుగుపొరుగువారు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంట్లో తవ్వి చూడగా, ఓ మహిళ మృతదేహం కుళ్ళిన స్థితిలో బయటపడింది. నెల రోజుల క్రితమే ఆ మహిళ హత్యకు గురయ్యిందని పోలీసులు గుర్తించారు. కుటుంబ వివాదాల కారణంగా భర్త, తన భార్యను చంపినట్లు పోలీసులు వెల్లడించారు. హత్య తర్వాత తన పిల్లలతో కలిసి నిందితుడు స్వదేశానికి పారిపోయినట్లు పోలీసులు చెప్పారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com