షార్జాలో భారత మహిళ హత్య
- April 26, 2018
షార్జా:36 ఏళ్ళ మహిళను హత్య చేసి, పాతి పెట్టిన ఘటన షార్జాలో వెలుగు చూసింది. షార్జాలోని మైసలోన్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ భారతీయ కుటుంబం నివాసం వుంటోన్న ఇంట్లోనుంచి దుర్గంధం వస్తుండడంతో పోలీసులకు, ఇరుగుపొరుగువారు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంట్లో తవ్వి చూడగా, ఓ మహిళ మృతదేహం కుళ్ళిన స్థితిలో బయటపడింది. నెల రోజుల క్రితమే ఆ మహిళ హత్యకు గురయ్యిందని పోలీసులు గుర్తించారు. కుటుంబ వివాదాల కారణంగా భర్త, తన భార్యను చంపినట్లు పోలీసులు వెల్లడించారు. హత్య తర్వాత తన పిల్లలతో కలిసి నిందితుడు స్వదేశానికి పారిపోయినట్లు పోలీసులు చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్







