షార్జాలో భారత మహిళ హత్య
- April 26, 2018షార్జా:36 ఏళ్ళ మహిళను హత్య చేసి, పాతి పెట్టిన ఘటన షార్జాలో వెలుగు చూసింది. షార్జాలోని మైసలోన్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ భారతీయ కుటుంబం నివాసం వుంటోన్న ఇంట్లోనుంచి దుర్గంధం వస్తుండడంతో పోలీసులకు, ఇరుగుపొరుగువారు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంట్లో తవ్వి చూడగా, ఓ మహిళ మృతదేహం కుళ్ళిన స్థితిలో బయటపడింది. నెల రోజుల క్రితమే ఆ మహిళ హత్యకు గురయ్యిందని పోలీసులు గుర్తించారు. కుటుంబ వివాదాల కారణంగా భర్త, తన భార్యను చంపినట్లు పోలీసులు వెల్లడించారు. హత్య తర్వాత తన పిల్లలతో కలిసి నిందితుడు స్వదేశానికి పారిపోయినట్లు పోలీసులు చెప్పారు.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్