న్యూస్ ఛానెల్స్ ను దెబ్బ తీసిన చంద్రబాబు ధర్మ దీక్ష..!
- April 26, 2018
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రత్యేకహోదా కోసం తన పుట్టిన రోజు నాడే ధర్మదీక్ష పేరుతో నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. స్వయంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రే దీక్ష చేపట్టడంతో, కవర్ చేయడం తప్ప మీడియా ఛానెల్స్ కు వేరే దారి లేకపోయింది. ఉదయం ఉదయం 6 నుంచి రాత్రి 9 వరకూ మొదట ధర్మదీక్ష ఏర్పాట్లు, ఆ తర్వాత ధర్మదీక్ష, అనంతరం బాబు ప్రసంగం, ఇలా మొత్తమ్మీద కలిపి ఆంధ్రాన్యూస్ ఛానెల్స్ ఆరోజు 15 గంటలు చంద్రబాబుకు దాసోహమయ్యాయి.
కొందర్ని భయపెట్టి, ఇంకొందరికి ఐదు నుంచి పది వరకూ లక్షల రూపాయలు ఇచ్చుకుని, ధర్మదీక్షను న్యూస్ ఛానెల్స్ తో రోజంతా హడావిడి చేయించి జాతీయ అంశంగా చేయాలనుకున్నారు చంద్రబాబు అండ్ పార్టీ. అయితే అది సరిగ్గా ఫలించినట్టు లేదు. బాబు ధర్మదీక్ష చేసిన ఆ ఒక్కరోజున, తెలుగు న్యూస్ ఛానెల్స్ కు రెగులర్ గా వచ్చే రేటింగుల కంటే దారుణమైన రేటింగ్స్ వచ్చాయి. టీఆర్పీ మొత్తం భయంకరంగా డౌన్ అయిపోవడం గమనార్హం. తెలుగులో ఏ న్యూస్ ఛానెల్ కు రేటింగ్ రాలేదు. రెగులర్ గా వచ్చే రేటింగ్ కన్నా ఆరోజు తక్కువ రేటింగులు నమోదు కావడం గమనార్హం.
తాజా వార్తలు
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!









