న్యూస్ ఛానెల్స్ ను దెబ్బ తీసిన చంద్రబాబు ధర్మ దీక్ష..!
- April 26, 2018
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రత్యేకహోదా కోసం తన పుట్టిన రోజు నాడే ధర్మదీక్ష పేరుతో నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. స్వయంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రే దీక్ష చేపట్టడంతో, కవర్ చేయడం తప్ప మీడియా ఛానెల్స్ కు వేరే దారి లేకపోయింది. ఉదయం ఉదయం 6 నుంచి రాత్రి 9 వరకూ మొదట ధర్మదీక్ష ఏర్పాట్లు, ఆ తర్వాత ధర్మదీక్ష, అనంతరం బాబు ప్రసంగం, ఇలా మొత్తమ్మీద కలిపి ఆంధ్రాన్యూస్ ఛానెల్స్ ఆరోజు 15 గంటలు చంద్రబాబుకు దాసోహమయ్యాయి.
కొందర్ని భయపెట్టి, ఇంకొందరికి ఐదు నుంచి పది వరకూ లక్షల రూపాయలు ఇచ్చుకుని, ధర్మదీక్షను న్యూస్ ఛానెల్స్ తో రోజంతా హడావిడి చేయించి జాతీయ అంశంగా చేయాలనుకున్నారు చంద్రబాబు అండ్ పార్టీ. అయితే అది సరిగ్గా ఫలించినట్టు లేదు. బాబు ధర్మదీక్ష చేసిన ఆ ఒక్కరోజున, తెలుగు న్యూస్ ఛానెల్స్ కు రెగులర్ గా వచ్చే రేటింగుల కంటే దారుణమైన రేటింగ్స్ వచ్చాయి. టీఆర్పీ మొత్తం భయంకరంగా డౌన్ అయిపోవడం గమనార్హం. తెలుగులో ఏ న్యూస్ ఛానెల్ కు రేటింగ్ రాలేదు. రెగులర్ గా వచ్చే రేటింగ్ కన్నా ఆరోజు తక్కువ రేటింగులు నమోదు కావడం గమనార్హం.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







