అమరావతి సచివాలయ నిర్మాణానికి టెండర్లు
- April 27, 2018అమరావతి రాజధాని నిర్మాణంలో సీఆర్డీఏ కీలక నిర్ణయం తీసుకుంది. రాజధానిలో టవర్ల నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించాలని సీఆర్డీఏ నిర్ణయించింది. 5 టవర్లలో 69 లక్షల చదరపు అడుగుల వైశాల్యంలో సచివాలయం నిర్మాణం చేపట్టనున్నారు. రూ.2,176 కోట్లతో మూడు ప్యాకేజీలుగా టెండర్లు ఏర్పాటు చేశారు.
జీఏడీ టవర్ (50 అంతస్థులు) నిర్మాణం వ్యయం 530 కోట్లు కాగా, 40 అంతస్థుల చొప్పున మిగిలిన నాలుగు టవర్లు నిర్మించనున్నారు. 1, 2 టవర్ల నిర్మాణ వ్యయం- 895 కోట్లు, 3, 4 టవర్ల నిర్మాణ వ్యయం- 751 కోట్లుగా నిర్ణయించారు. టెండర్ల దాఖలుకు వచ్చే నెల 16 వరకు గడువు విధించారు. ప్రముఖ కంపెనీలు ఇంట్రెస్టుతో ఉన్నట్టు సమాచారం.
కేంద్రంతో తెగతెంపులు చేసుకున్నాకా ఇకపై పై నుండి ఎలాంటి సాయం ఉండదు అనే నిర్ధారణకు వచ్చారు చంద్రబాబు నాయుడు. అయితే డబ్బులకు కటకటలాడుతున్నా ముందుకు పోవడమే అని నిర్ణయించుకుని ముందడుగు వేశారు. ఇప్పటికే నిధుల సమీకరణకు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజా వార్తలు
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వారాంతంలో మిశ్రమ వాతావరణం