ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- May 03, 2024
హైదరాబాద్: డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే దోస్త్ నోటిఫికేషన్ ను శుక్రవారం ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి విడుదల చేయనున్నారు.
ఆయా డిగ్రీ కాలేజీల్లో ఫస్టియర్లో ప్రవేశాలకు దోస్త్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కాగా మూడు విడతల్లో ఈ ప్రక్రియ ద్వారా ప్రవేశాలు చేపట్టనున్నారు.
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు తేదీని పొడిగించారు. ఈ మేరకు బోర్డు అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మే 4వ తేదీ వరకు విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించుకోవచ్చని స్పష్టంచేశారు. వాస్తవానికి ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు గురువారంతో పూర్తయింది. కానీ విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదనే కారణంగా 4వ తేదీ వరకు పొడిగించారు. ఇదిలా ఉండగా ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జరగనున్నాయి.
తాజా వార్తలు
- సౌదీ రక్షణ దళాల చర్య: బాలిస్టిక్ క్షిపణి, రెండు డ్రోన్లు నిర్వీర్యం
- గ్యాస్ వినియోగదారులకు షాక్
- విదేశాల్లో ఇరానీయులకు హెచ్చరిక, దేశద్రోహం చేస్తే మరణశిక్ష
- రాత్రి సమయంలో ఎమర్జెన్సీ అలర్ట్ సౌండ్ లో మార్పు
- అబుదాబి నుండి భారత్కు ఎతిహాద్ విమానాలు–నేటి షెడ్యూల్
- మనామాలో నివాస భవనం పై ఇరాన్ దాడి: ఒకరు మృతి, పలువురికి గాయాలు
- కమ్యూనిటీ వర్చువల్ సమావేశం నిర్వహించిన భారత రాయబారి..!!
- అత్యవసర హెచ్చరికలు.. ప్రజలకు సౌదీ అరేబియా అప్పీల్..!!
- ఒమన్లో CBSE విద్యార్థుల పై పరీక్షల ఒత్తిడి..!!
- మిడిలీస్టు సంక్షోభం.. 40వేలకు పైగా ఫ్లైట్స్ క్యాన్సిల్..!!









