సివిల్స్ టాపర్ సిరిసిల్ల వాసి...
- April 27, 2018తెలంగాణ:సివిల్ సర్వీస్ పరీక్ష -2017 తుది ఫలితాలను యూపీఎస్సీ ఈ సాయంత్రం విడుదల చేసింది. గతేడాది అక్టోబర్- నవంబర్ మధ్య నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. పోయినేడాది అక్టోబర్ 28న యూపీఎస్సీ మెయిన్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్య మౌఖిక పరీక్షలు నిర్వహించి మొత్తం 990 మంది పేర్లను ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్తో పాటు గ్రూప్-ఎ, గ్రూప్-బి ఉద్యోగాలకు యూపీఎస్సీ ఎంపికచేసింది. ఈ పరీక్ష ఫలితాలను అభ్యర్థులు తమ అధికారిక వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చని యూపీఎస్సీ వెల్లడించింది. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయన కుమారుడు సాయి ప్రణీత్ కూడా సివిల్స్ ర్యాంక్ సాదించిన వారిలో ఉన్నారు.
సివిల్స్లో తెలంగాణకు చెందిన దురిశెట్టి అనుదీప్ మొదటి ర్యాంక్ సాధించాడు. అనుదీప్ జగిత్యాల జిల్లా మెట్పల్లివాసి. ఇక అనుకుమారి రెండో ర్యాంక్ సాధించగా.. సచిన్ గుప్తా మూడో ర్యాంకు సాధించాడు. ఈ సివిల్స్ ఫలితాల్లో తెలుగు రాష్ర్టాల నుంచి పలువురు అభ్యర్థులు మెరుగైన ర్యాంకులు సాధించారు. నీలం సాయితేజ 43వ ర్యాంక్, నారపురెడ్డి మౌర్య 100వ ర్యాంక్, జి. మాధురి 144వ ర్యాంక్, వివేక్ జాన్సన్ 195 ర్యాంకు సాధించారు. సాయి ప్రణీత్కు 196వ ర్యాంక్ వచ్చింది. అక్షయ్ కుమార్ 654వ ర్యాంక్, భార్గవ శేఖర్ 816వ ర్యాంకు సాధించారు.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్