లేటెస్ట్ టెక్నాలజీతో బంగారం స్మగ్లింగ్...
- April 27, 2018శంషాబాద్:దొరికితే కదా దొంగ.. దొరక్కపోతే దొరే. స్కానింగ్ సెన్సార్ మిషన్లకి కూడా దొరక్కుండా పక్కా ప్లాన్ చేసుకుని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి బంగారం స్మగ్లింగ్ చేద్దామనుకున్నారు. కానీ అడ్డంగా బుక్కయ్యారు. ఎల్ఈడీ బ్యాటరీలో ఎనిమిది బంగారు రేకుల్ని తీసుకువచ్చిన ఓ వ్యక్తిని హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. 445 గ్రాములు ఉన్న ఈ బంగారం ఖరీదు రూ.14 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. దుబాయ్కి చెందిన ఓ ముఠానే ఎల్ఈడీ బ్యాటరీ ద్వారా బంగారం అక్రమణ రవాణా మార్గాన్ని ఎంచుకుని ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇండిగో ఎయిర్ లైన్స్ నుంచి వచ్చిన అతడిని విచారించగా తనకేమీ తెలియదని ఎలాంటి వివరాలు చెప్పకుండా ఆ లైట్ను తీసుకుని హైదరాబాద్ వెళ్లమన్నారని, అక్కడ తమ వారు వచ్చి తీసుకుంటారని చెప్పారన్నాడు. అనుమానాస్పద స్థితిలో తచ్చాడుతున్న ఆ వ్యక్తిని విమాన సిబ్బంది అదుపులోకి తీసుకుని విచారించారు. అతడి బ్యాగులో ఉన్న ఎల్ఈడీ లైట్ను పరిశీలించగా బ్యాటరీల తీరులో మార్పు కనిపించింది. పగుల గొట్టి చూడగా వారి అనుమానాన్ని నిజం చేస్తూ లోపల నల్లటి పొడితో కప్పి ఉంచిన బంగారం రేకులు ఎనిమిది బయటపడ్డాయి. అయితే దీని వెనుక పెద్ద బంగారం స్మగ్లింగ్ రాకెట్ ఉండి ఉండవచ్చని కస్టమ్స్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు చేపట్టే ఆలోచనలో ఉన్నారు.
తాజా వార్తలు
- భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలు ఖరారు..!
- మరోసారి బహిరంగ క్షమాపణలు తెలిపిన రాందేవ్ బాబా
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్
- తెలంగాణలో భానుడి భగభగలు..వడదెబ్బతో ముగ్గురి మృతి
- తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదల
- 33,350 టయోటా ల్యాండ్ క్రూయిజర్, లెక్సస్ కార్ల రీకాల్
- నేపాల్ అధ్యక్షుడితో అమీర్ భేటీ
- పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్న దుబాయ్ ఎయిర్ పోర్ట్స్
- ఇండియా-కువైట్ ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్స్ సక్సెస్..!