దుబాయిలో తాండ్ర(జి) వాసి మృతి
- April 29, 2018తాండ్ర(జి)(సారంగాపూర్): తాండ్ర(జి) గ్రామానికి చెందిన మహ్మద్ తాజొద్దిన్(22) దుబాయిలో గుండె పోటుతో మృతి చెందారు. ఈ నెల 26న విధులు ముగించుకుని తన గదికి రాగా..తెల్లవారే సరికి నిద్రలోనే ప్రాణాలు విడిచారు. స్నేహితులు ద్వారా ఈ విషయం తెలిసిందని తల్లిదండ్రులు ఆదివారం వివరించారు. తాజొద్దిన్ది నిరుపేద కుటుంబం కావడంతో ఉపాధి కోసం రెండేళ్ల క్రితం దుబాయి వెళ్లారు. తండ్రి అన్నుసాబ్, పెద్దన్న రాజాక్ మృతి చెందారు. మరో అన్న ఇబ్రహీమ్తో కలిసి తాజొద్దిన్ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇంతలో యువకుడు గుండె పోటుతో మృతి చెందడం ఆ కటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది. మృతుడికి తల్లి, ఇద్దరు చెల్లెల్లు ఉన్నారు. ప్రభుత్వం చొరవ చూపి కుమారుడి మృతదేహం త్వరగా ఇంటికి వచ్చేలా చూడాలని తల్లి నన్నుబి విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత
- బయోమెట్రిక్ ఫింగర్ప్రింట్ గడువు పొడిగింపు
- కువైట్ నుండి బయలుదేరిన మెజెస్టి ది సుల్తాన్
- రియల్ ఎస్టేట్ ఏజెంట్లపై కొరడా..7 సంస్థల లైసెన్స్లు సస్పెండ్
- యూఏఈ ఫ్లైట్స్..కొత్త ప్రోటోకాల్ జారీ
- వారంలో 450,000 మంది ప్రజలు రఫా నుండి తరలిపోయారు.. UN
- యూఏఈలో దశల వారీగా జయవాన్ డెబిట్ కార్డ్ల జారీ
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్