'రెడ్' యాపిల్
- April 29, 2018ప్రఖ్యాత మొబైల్ తయారీ సంస్థ యాపిల్ తాజాగా ఐ ఫోన్ 8 ప్లస్ ను మార్కెట్ లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ సారి వచ్చిన ఈ మొబైల్ ఎన్నడూ లేని విధంగా రెడ్ కలర్ లో దర్శనమిస్తోంది. దీని వెనకాల ప్రత్యేక కారణం ఉందండోయ్ అదేంటంటే..రెడ్ అనే సంస్థతోయాపిల్ కు దాదాపు 11 ఏళ్ల సంబంధం ఉంది. ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం ఏంటంటే..ఆఫ్రికా దేశంలోని ఎయిడ్స్ / హెచ్ఐవి భాదితులలో తల్లి నుండి బిడ్డకు సంక్రమించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను, కౌన్సెలింగ్ ను, మెడిసిన్ ను అందిస్తుంటారు.
ఇక తాజాగా రెడ్ సంస్థకు..యాపిల్ సంస్థ 160 మిలియన్ డాలర్లను విరాళంగా ఇవ్వడానికి నడుం బిగించి..ఈ రెడ్ కలర్ లో ఐ ఫోన్ 8 ప్లస్ ఫోన్ ను తయారు చేసింది. ఈ ఫోన్ ధర మన ఇండియాలో రూ. 67,940 ఉండనుంది. ఇలా రెడ్ కలర్ ఉన్న ఏ యాపిల్ వస్తువు కొన్నా ఆ మొత్తాన్ని రెడ్ సంస్థకు విరాళంగా వెళ్లనుంది. తద్వారా ఎయిడ్స్ లేని సమాజాన్ని నిర్మించడంలో ఈ ఫోన్స్ కొన్నవారు భాగస్వామ్యం కానున్నారు.
మరోవైపు ఈ రెడ్ ఫోన్ రెండు వెర్షన్స్ గా రానుంది. ఒకటి 64 జీబీ కాగా మరొకరి 256 జీబీ లతో అందుబాటులోకి తెచ్చారు.
తాజా వార్తలు
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం