ధర్మపోరాటంలో మాదే విజయం:చంద్రబాబు
- April 30, 2018
తిరుపతి:నమ్మక ద్రోహం, కుట్ర రాజకీయాలపై ధర్మ పోరాటం చేస్తున్నామని, ధర్మ పోరాటంలో తామే విజయం సాధిస్తామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు.నీతిమాలిన పార్టీలకు మద్దతిస్తూ కేంద్రం ఏం సంకేతాలిస్తోందని చంద్రబాబునాయుడు ప్రశ్నించారు.
ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు ఇతర హమీలను తిరుపతి సాక్షిగా మోడీ ఇచ్చిన హమీలను ధర్మపోరాట సభలో టిడిపి విన్పించింది. 2014 ఎన్నికల సమయంలో తిరుపతి వేదికగా మోడీ ఇచ్చిన హమీల సీడీలను ఈ సభ ద్వారా విన్పించారు.
2014 ఎన్నికల సమయంలో తిరుపతి వేదికగా బిజెపి ఇచ్చిన ఎన్నికల హమీలను విస్మరించిందని ఆరోపిస్తూ టిడిపి ఆధ్వర్యంలో సోమవారం నాడు ధర్మపోరాట దీక్షను నిర్వహించారు. ఈ దీక్షలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సహ ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు పాల్గొన్నారు.
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వేదికపై ఉన్న ఎన్టీఆర్ విగ్రహనికి నివాళులర్పించారు. టిడిపికి చెందిన పలువురు నేతలు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కార్యక్రమంలో పాల్గొన్నారు.
అంతిమ విజయం మాదే
నమ్మక ద్రోహం, కుట్ర రాజకీయాలపై తాము ధర్మ పోరాటం చేస్తున్నట్టుగా చంద్రబాబునాయుడు చెప్పారు. నాలుగేళ్ళు గడిచినా ఇచ్చిన హమీలను కేంద్రం అమలు చేయలేదన్నారు. నాలుగేళ్ళ క్రితం మోడీ ఇచ్చిన హమీలను గుర్తు చేయడంతో బిజెపి చేసిన నమ్మకద్రోహన్ని ప్రజలకు వివరించేందుకు ఈ సభ నిర్వహిస్తున్నట్టు చెరప్పారు. ధర్మపోరాటంలో విజయం సాధిస్తానని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!









