హైదరాబాద్ లో తనిఖీలతో నరకం చూపిస్తున్న పోలీసులు....
- May 02, 2018
హైదరాబాద్:వేళాపాలా లేని డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు హైదరాబాద్ వాసులకు నరకం చూపిస్తున్నాయి. అసలే ఇరుకు రోడ్లు.. ఆపై పీక్ ట్రాఫిక్ టైం. ఈ సమయంలో రోజూ డ్రంకెన్ డ్రైవ్లు ఏర్పాటు చేస్తూ వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. హైదరాబాద్ యూసుఫ్ గూడలో రోజూ రాత్రి 7 గంటల నుంచి 9 గంటలకు వరకు ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించడం వల్లే.. నిత్యం వాహనదారులు ట్రాఫిక్ వలయంలో చిక్కుకుంటున్నారు. అంతే కాకుండా ఇక్కడే మెట్రో స్టేషన్ ను ఏర్పాటు చేయడంతో రోడ్డు మరీ చిన్నదిగా మారిపోయింది. పోలీసులు బారికేడ్లు పెట్టి.. తనిఖీలు చేయడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఆఫిస్ నుంచి ఇంటికి వెళ్లే సమయంలో రోజూ ఇక్కడ ట్రాఫిక్ నిలిచి పోవడంతో వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు రాత్రి 9 గంటల తరువాత నిర్వహించాలని కోరుతున్నారు.అయితే పోలీసులు మాత్రం తమ ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్నామని అంటున్నారు.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









