సింగపూర్ లో తెలుగు సమాజం మేడే వేడుకలు...
- May 02, 2018సింగపూర్:"శ్రమిద్దాం...శ్రమను గుర్తిద్దాం...శ్రమను గౌరవిద్దాం" అనే నినాదం తో సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో అంతర్జాతీయ కార్మికదినోత్సవ వేడుకలను మే 1, మంగళవారం నాడు స్థానిక క్రాంజి రెక్రియేషన్ సెంటర్ నందు ఘనంగా నిర్వహించారు. ఆనందోత్సాహాల మధ్య వినోదభరితంగా సాగిన ఈ కార్యక్రమానికి సుమారు 800 మంది స్థానిక తెలుగు కార్మికసోదరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి వందేమాతరం శ్రీనివాస్ ముఖ్య అతిధిగా పాల్గొని , తన సాహితీ ప్రస్థానంలో స్వరపరిచిన, గానం చేసిన అనేక వైవిధ్య మరియు ఉత్తేజభరితమైన పాటలతో ఆహుతులను ఉర్రూతలూగించారు. సింగపూర్ తెలుగువారి కోసం వారు ఒకపాటను రచించి, స్వరపరచి ఆలపించారు. శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగు సమాజం మొట్టమొదటిసారిగా నిర్వహించిన ఈ కార్యక్రమం కి తను ముఖ్య అతిధిగా హాజరు కావటంపట్ల హర్షంవ్యక్తపరిచారు. ఈ వేడుకల సంధర్భంగా సమాజం వారు కార్మికసోదరులకు నిర్వహించిన క్రికెట్ పోటీల విజేతలకు బహుమతులను , ప్రశంసాపత్రాలను అందించారు.
సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి మాట్లాడుతూ,సింగపూర్ తెలుగు సమాజం తెలుగు కార్మిక సోదరులకి ఏ సమస్య వచ్చినా ఎల్లప్పుడూ అండ గా ఉంటామని,తెలుగు వారందరూ ఐకమత్యంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమానికి హాజరైన తెలుగు వారికి మరియు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఉపాధ్యక్షుడు జ్యోతీశ్వర్ కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి శ్రమించిన కార్యవర్గసభ్యులకీ మరియు దాతలకు కార్యదర్శి సత్య చిర్ల ప్రత్యేక దన్యవాదాలు తెలియజేశారు.
తాజా వార్తలు
- లండన్ లో అంగరంగ వైభవంగా శక పురుషుని శత జయంతి వేడుకలు
- ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..
- రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖల్లో ఉద్యోగాలు...
- ICBF ఆధ్వర్యంలో వైభవంగా ‘లేబర్ డే రంగ్ తరంగ్ 2023’
- ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణికుడికి గుండెపోటు..కాపాడిన వైద్యుడు..!
- మస్కట్లో 49 మంది మహిళా కార్మికులు అరెస్ట్..!
- వ్యభిచార రింగ్ నడిపిన మహిళలకు 10 ఏళ్ల జైలుశిక్ష
- ఈ వేసవిలో ఎయిర్పోర్టుల్లో రద్దీ.. నివారణకు 6 మార్గాలు..!
- Dhs1.6b హౌసింగ్ లోన్ను ఆమోదించిన షేక్ మహమ్మద్.. 2వేల మందికి లబ్ధి
- హజ్ కోసం 22,000 మంది నియామకం