ఇరాక్:13 మంది తెలంగాణవాసులు బంధీలుగా నరకయాతన
- June 03, 2018నిజామాబాద్:ఇరాక్లో 13 మంది తెలంగాణవాసులు బంధీలుగా నరకయాతన అనుభవిస్తున్నారు. భారీగా వేతనాలు అంటూ తమను బశ్రా ప్రాంతానికి ఏజెంట్లు అక్రమంగా తరలించారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ మేరకు బాధితులు షేర్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాధితుల్లో ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ వాసులు ఉన్నట్లు సమాచారం. తమకు కనీసం మంచినీరు కూడా దొరకడం లేదని, ఏజెంట్లు తమను మోసం చేశారంటూ వాట్సాప్ ద్వారా బాధితులందరూ కలిసి ఓ వీడియో పంపారు.
తెలంగాణ ప్రభుత్వం తమ వాళ్లను ఆదుకోవాలని బాధితుల కుటుంబసభ్యులు కోరుతున్నారు. గల్ఫ్ బాధితుల సంఘం ప్రతినిధి బసంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ దృష్టికి ఇరాక్లో తెలంగాణ వాసుల బంధీ సమస్యను తీసుకెళ్లారు. ప్రస్తుతం బాగ్దాద్ లోని బశ్రాలో ఓ ప్రైవేట్ కంపెనీలో బాధితులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం