స్మార్ట్ పార్కింగ్ ప్రాజెక్ట్ని ప్రారంభించిన దుబాయ్ పోలీస్
- June 22, 2018దుబాయ్ పోలీస్, స్మార్ట్ మల్టీ లెవల్ పార్కింగ్ ప్రాజెక్ట్ని ప్రారంభించింది. దుబాయ్ పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ అబ్దుల్లా ఖలీఫా అల్ మర్రి ఈ ప్రాజెక్ట్ కోసం జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. మురాక్కాబాత్ పోలీస్స్టేషన్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు. యూఏఈలో ఇది తొలి ప్రాజెక్ట్ అని మేజర్ జనరల్ అల్ మర్రి చెప్పారు. 2016-21 స్ట్రాటజిక్ ప్లాన్లో భాగంగా దుబాయ్ పోలీస్ ఈ ప్రాజెక్ట్ని చేపట్టిందని అన్నారు. రికార్డ్ టైమ్లో వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వివరించారాయన. ఈ ప్రాజెక్ట్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని కార్ పార్కింగ్ సౌకర్యాలను అందుబాటులోకి తెస్తారు.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్