కేన్సర్ రోగులను పరామర్శించిన జగపతిబాబు
- July 15, 2018విజయవాడ: ప్రముఖ సినీనటుడు జగపతిబాబు ఆదివారం విజయవాడలో పర్యటించారు. రూట్స్ హెల్త్ ఫౌండేషన్ పదో వార్షికోత్సవం సందర్భంగా ఆయన సంస్థను సందర్శించారు. లాస్ట్ స్టేజ్ క్యాన్సర్ దశలో ఉన్న రోగులను జగపతిబాబు పలకరించారు. క్యాన్సర్ రోగులకు రూట్స్ ఫౌండేషన్ ఉచితంగా అందిస్తున్న సేవలు చూసి ఆయన హర్షం వ్యక్తం చేశారు. స్వలాభం కోసం జీవించే ఈ పరిస్థితుల్లో ఇలా స్వచ్చందంగా సేవ చేయడం అభినందనీయమని ప్రశంసించారు. చివరి రోజులు గడుపుతున్న క్యాన్సర్ రోగుల బాధను పంచుకుని వారకి అండగా ఉంటున్న ఈ స్వచ్చంద సంస్థ సభ్యులు అభినందిస్తున్నట్టు చెప్పారు.
రోజులు లెక్కపెట్టుకుంటూ బతకడం ఎంత కష్టమో అందరికీ తెలుసని.. ఇలాంటి స్వచ్చంద సంస్థలలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 'సైరా' చిత్రంలో జగపతిబాబు నటిస్తున్నారు. అయినప్పటికీ ఆదివారం తన షూటింగ్ను సర్దుబాటు చేసుకుని మరి ఇక్కడికి వచ్చినట్లు చెప్పారు. చివరి రోజులు గడుపుతున్న కేన్సర్ బాధితులకు అండగా నిలబడి సేవ చేస్తున్న రూట్స్ ఫౌండేషన్ సభ్యులను హృదయపూర్వకంగా అభినందిస్తున్నానని జగపతిబాబు తెలిపారు.
తాజా వార్తలు
- QR247 మిలియన్లు తిరిగి చెల్లించాలని సీఈఓను ఆదేశించిన కోర్టు
- 2023లో 99%కి చేరుకున్న సౌదీ ఇంటర్నెట్ వినియోగం
- మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం.. అగ్రస్థానంలో భారతీయులు
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ సీజన్..మరో 3 రోజులు పొడిగింపు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్