ఎన్నారై ఆఫ్ ది ఇయర్ అవార్డ్స్:యు.ఏ.ఈకి చెందిన నలుగురు ఇండియన్లకు చోటు
- July 16, 2018యు.ఏ.ఈ కి చెందిన భారతీయ వలసదారులకు 2018 ఎన్ఆర్ఐ ఆఫ్ ది ఇయర్ పురస్కారాలు దక్కాయి. మొత్తం 11,500 గ్లోబల్ నామినీస్లో భారతీయ వలసదారులకు చోటు దక్కడం గమనార్హం. అమితేష్ పౌల్, జోగిరాజ్ సికిదార్, వర్దరాజ్ షెట్టి, ప్రశాంత్ మంఘ్తా 'మేక్ ఇండియా ప్రౌడ్'గా నిలిచారు. ఆయా రంగాల్లో వారు సాధించిన విజయాలు, స్వదేశానికి దూరంగా విదేశాల్లో భారతీయతకు సరికొత్త గౌరవం తెచిచనవారిగా వీరిని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. ఎన్ఆర్ఐ ఆఫ్ ది ఇయర్ పేరుతో వరుసగా ఇది ఐదో ఏడాది పురస్కారాల ప్రధానం కావడం గమనార్హం. టైమ్స్ నౌ, ఐసీఐసీఐ బ్యాంక్, గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ సహకారంతో ఈ పురస్కారాలను అందిస్తున్నారు. ఇప్పటిదాకా ఈ పురస్కారాలను అందుకున్నవారి సంఖ్య తాజా లిస్ట్తో 19కి చేరుకోనుంది. ఇదిలా వుంటే 2018 ఏడాదికిగాను 22 మంది ఎన్నారైలకు పురస్కారం దక్కగా, ఇందులో ఐదుగురు మిడిల్ ఈస్ట్కి చెందినవారు. ఇందులో నలుగురు యూఏఈలో నివసిస్తున్నారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు