సైన్‌ బోర్డ్స్‌ డ్యామేజీపై మినిస్ట్రీ హెచ్చరిక

- July 17, 2018 , by Maagulf
సైన్‌ బోర్డ్స్‌ డ్యామేజీపై మినిస్ట్రీ హెచ్చరిక

మస్కట్‌:మినిస్ట్రీ ఆఫ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, సైన్‌ బోర్డ్స్‌ని డ్యామేజ్‌ చేయడంపై పౌరులు, నివాసితులకు హెచ్చరికలు జారీ చేసింది. సైన్‌ బోర్డ్స్‌ని ధ్వంసం చేయరాదనీ, వాటిపై ఎలాంటి స్కెచెస్‌ వేయరాదనీ, రాతలు సైతం చేయకూడదని మినిస్ట్రీ పేర్కొంది. వాహనదారులకు ఉపయోగపడే సైన్‌ బోర్డ్స్‌ని పాడు చేస్తే, జరీమానా తప్పవని అధికారులు పేర్కొన్నారు. ఉల్లంఘనలకు పాల్పడేవారికి 500 ఒమన్‌ రియాల్స్‌ జరీమానా విధించబడుతుంది. ఈ మేరకు మినిస్టీరియల్‌ డెసిషన్‌ నెం.155/2017లో స్పష్టంగా నిబంధనల్ని పేర్కొనడం జరిగిందని అధికారులు వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com