అమర్నాథ్ యాత్రను 3 రోజులపాటు రద్దు చేసిన ప్రభుత్వం!
- August 20, 2018అమర్నాథ్ యాత్రను ప్రభుత్వం మూడు రోజలపాటు రద్దు చేసింది. నేటి నుంచి 23 వరకు వరకు లోయలోకి ఒక్కరిని కూడా అనుమతించబోమని స్పష్టం చేసింది. అయితే, యాత్రను ఎందుకు రద్దు చేసిందన్న వివరాలను మాత్రం ప్రభుత్వం బయటపెట్టలేదు. బుధవారం బక్రీద్ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనికి తోడు ఈ నెల 26తో యాత్ర ముగుస్తుండడంతో యాత్రికుల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతూ వస్తోంది. సోమవారం భగవతి నగర్ యాత్రి నివాస్ నుంచి కేవలం 43 మందితో కూడిన యాత్రికుల బృందం లోయలోకి బయలుదేరింది. జూన్ 28న అమర్నాథ్ యాత్ర ప్రారంభం కాగా ఇప్పటి వరకు 2.82 లక్షల మంది భక్తులు అమరనాథుడ్ని దర్శించుకున్నారు. గత మూడేళ్లతో పోలిస్తే ఇంతమంది దర్శించుకోవడం ఇదే తొలిసారి.
తాజా వార్తలు
- బయోమెట్రిక్ ఫింగర్ప్రింట్ గడువు పొడిగింపు
- కువైట్ నుండి బయలుదేరిన మెజెస్టి ది సుల్తాన్
- రియల్ ఎస్టేట్ ఏజెంట్లపై కొరడా..7 సంస్థల లైసెన్స్లు సస్పెండ్
- యూఏఈ ఫ్లైట్స్..కొత్త ప్రోటోకాల్ జారీ
- వారంలో 450,000 మంది ప్రజలు రఫా నుండి తరలిపోయారు.. UN
- యూఏఈలో దశల వారీగా జయవాన్ డెబిట్ కార్డ్ల జారీ
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?