దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- May 14, 2024
యూఏఈ: అధికారులు దొమలను నిర్మూలించే ప్రయత్నాలను వేగవంతం చేస్తున్నారు. దొమల సంతానోత్పత్తి ప్రదేశాలను నివేదించమని నివాసితులను వాతావరణ మార్పు మరియు పర్యావరణ మంత్రిత్వ శాఖ (MoCCAE) కోరింది. ఇటీవల దొమల సంఖ్య పెరుగుతుందని మంత్రిత్వ శాఖలోని మునిసిపల్ అఫైర్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఒతైబా సయీద్ అల్ ఖైదీ తెలిపారు. మారుతున్న వాతావరణ పరిస్థితులు దీనికి కారణం అన్నారు. ఇటీవల వర్షాలకు అనేక ప్రాంతాల్లో నీరు చేరిందన్నారు. చెరువులు, నీటి కుంటలు లేదా సరిగా ఎండిపోయిన పూల కుండీలు వంటి నీటి నిల్వలు ఉన్న ప్రాంతాలు దోమలకు సంతానోత్పత్తి కేంద్రాలుగా మారవచ్చని హెచ్చరించారు. నివాసితులు 8003050కి డయల్ చేసి కొంత కాలంగా పట్టించుకోకుండా నిలిచిపోయిన నీరు ఉన్న ప్రాంతాల గురించి తెలియజేయాలని కోరారు. దోమల వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాలను కూడా తెలపాలని సూచించారు. దోమల వ్యాప్తిని అరికట్టడానికి మంత్రిత్వ శాఖ GIS మ్యాపింగ్, సెన్సార్లు, ప్రిడిక్టివ్ మోడలింగ్ మరియు బిగ్ డేటా అనలిటిక్స్ని ఉపయోగిస్తోందన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో మరో భారీ టెర్రర్ నెట్వర్క్ క్రాక్ డౌన్..!!
- స్వదేశానికి వస్తూ అనంతలోకాలకు..పార్థివ దేహం ఇండియాకు తరలించే ప్రయత్నం..!!
- షార్జాలో భారతీయ వ్యక్తి దారుణ హత్య..సోషల్ మీడియా వివాదమే కారణమా?
- ఇండియా, జిబూటీలతో జెడ్డా లింకింగ్..అందుబాటులోకి కొత్త సర్వీస్..!!
- బిగ్ టికెట్ అబుదాబి.. Dh20 మిలియన్స్ గెలుచుకున్న భారతీయ ప్రవాసి..!!
- ఖతార్ లో గోడివా చాక్లెట్ బార్ రీకాల్..!!
- బహ్రెయిన్, కువైట్లపై దాడులపై స్పందించిన ఒమన్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’









