దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- May 14, 2024
యూఏఈ: అధికారులు దొమలను నిర్మూలించే ప్రయత్నాలను వేగవంతం చేస్తున్నారు. దొమల సంతానోత్పత్తి ప్రదేశాలను నివేదించమని నివాసితులను వాతావరణ మార్పు మరియు పర్యావరణ మంత్రిత్వ శాఖ (MoCCAE) కోరింది. ఇటీవల దొమల సంఖ్య పెరుగుతుందని మంత్రిత్వ శాఖలోని మునిసిపల్ అఫైర్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఒతైబా సయీద్ అల్ ఖైదీ తెలిపారు. మారుతున్న వాతావరణ పరిస్థితులు దీనికి కారణం అన్నారు. ఇటీవల వర్షాలకు అనేక ప్రాంతాల్లో నీరు చేరిందన్నారు. చెరువులు, నీటి కుంటలు లేదా సరిగా ఎండిపోయిన పూల కుండీలు వంటి నీటి నిల్వలు ఉన్న ప్రాంతాలు దోమలకు సంతానోత్పత్తి కేంద్రాలుగా మారవచ్చని హెచ్చరించారు. నివాసితులు 8003050కి డయల్ చేసి కొంత కాలంగా పట్టించుకోకుండా నిలిచిపోయిన నీరు ఉన్న ప్రాంతాల గురించి తెలియజేయాలని కోరారు. దోమల వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాలను కూడా తెలపాలని సూచించారు. దోమల వ్యాప్తిని అరికట్టడానికి మంత్రిత్వ శాఖ GIS మ్యాపింగ్, సెన్సార్లు, ప్రిడిక్టివ్ మోడలింగ్ మరియు బిగ్ డేటా అనలిటిక్స్ని ఉపయోగిస్తోందన్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు









