దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- May 14, 2024
యూఏఈ: అధికారులు దొమలను నిర్మూలించే ప్రయత్నాలను వేగవంతం చేస్తున్నారు. దొమల సంతానోత్పత్తి ప్రదేశాలను నివేదించమని నివాసితులను వాతావరణ మార్పు మరియు పర్యావరణ మంత్రిత్వ శాఖ (MoCCAE) కోరింది. ఇటీవల దొమల సంఖ్య పెరుగుతుందని మంత్రిత్వ శాఖలోని మునిసిపల్ అఫైర్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఒతైబా సయీద్ అల్ ఖైదీ తెలిపారు. మారుతున్న వాతావరణ పరిస్థితులు దీనికి కారణం అన్నారు. ఇటీవల వర్షాలకు అనేక ప్రాంతాల్లో నీరు చేరిందన్నారు. చెరువులు, నీటి కుంటలు లేదా సరిగా ఎండిపోయిన పూల కుండీలు వంటి నీటి నిల్వలు ఉన్న ప్రాంతాలు దోమలకు సంతానోత్పత్తి కేంద్రాలుగా మారవచ్చని హెచ్చరించారు. నివాసితులు 8003050కి డయల్ చేసి కొంత కాలంగా పట్టించుకోకుండా నిలిచిపోయిన నీరు ఉన్న ప్రాంతాల గురించి తెలియజేయాలని కోరారు. దోమల వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాలను కూడా తెలపాలని సూచించారు. దోమల వ్యాప్తిని అరికట్టడానికి మంత్రిత్వ శాఖ GIS మ్యాపింగ్, సెన్సార్లు, ప్రిడిక్టివ్ మోడలింగ్ మరియు బిగ్ డేటా అనలిటిక్స్ని ఉపయోగిస్తోందన్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







