శొంఠి పొడి టీ... ఆ సమస్యకు భేషుగ్గా పనిచేస్తుంది... వెల్లుల్లి ఉపయోగాలు...
- August 26, 2018నడుమునొప్పి చాలామంది మహిళలను ఇబ్బంది పెట్టే సమస్య. నడుము పట్టేయడం, ఆ భాగంలోని కండరాలు, ఎముకలు బలహీనపడడం, గర్భధారణ, ప్రసవం, గర్భాశయంలో సమస్యలు, ఫైబ్రాయిడ్లు వంటివి నడుము నొప్పులకు దారితీస్తుంటాయి. ఇలాంటి సమస్యలను తొలగించుకునేందుకు ఆయుర్వేదంలో చికిత్స ఉంది.
పీచు పదార్థం అధికంగా ఉంటే ఆకుకూరలు, కాయగూరలు వంటివి ఆహారంలో చేర్చుకోవాలి. ముఖ్యంగా కడుపులో గ్యాస్ పెంచే సెనగలు, మసాలా పదార్థాలు వంటి వాటికి దూరంగా ఉండాలి. కూర్చునేటప్పుడు, నిలబడేటప్పుడు భంగిమ చాలా ముఖ్యం. వెన్నెముక నిటారుగా ఉండేలా కూర్చోవాలి. కుర్చీలలో కూర్చున్నప్పుడు వంగినట్లు కూర్చోకూడదు.
ఒక కప్పు నువ్వుల నూనెలో కొద్దిగా వెల్లుల్లి పేస్ట్ను కలుపుకుని నడుముకు రాసుకుంటే నొప్పి తగ్గుతుంది. శొంఠి కషాయంలో కొద్దిగా ఆముదం కలుపుకుని నడుముకు రాసుకుంటే కూడా నడుము నొప్పి తగ్గుతుంది. కప్పు నీళ్లలో కొద్దిగా మిరియాలు, లవంగాలు, శొంఠి పొడి వేసుకుని టీలా కాచుకోవాలి. ఈ టీను ప్రతిరోజూ నడుముకు రాసుకోవడం వలన నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.
దాల్చిన చెక్క పొడిలో కొద్దిగా తేనెను కలుపుకుని రోజుకు రెండు మార్లు నడుముకు రాసుకోవాలి. కొబ్బరి నూనెను వేడిచేసుకుని అందులో కొద్దిగా కర్పూరం వేసి కరిగించాలి. ఈ మిశ్రమం చల్లారిన తరువాత నడుముకు మర్దనా చేసుకుంటే కూడా నొప్పి తగ్గుతుంది.
తాజా వార్తలు
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!
- QR247 మిలియన్లు తిరిగి చెల్లించాలని సీఈఓను ఆదేశించిన కోర్టు
- 2023లో 99%కి చేరుకున్న సౌదీ ఇంటర్నెట్ వినియోగం
- మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం.. అగ్రస్థానంలో భారతీయులు
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ సీజన్..మరో 3 రోజులు పొడిగింపు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం