ఇల్లీగల్ కార్ వాష్: 500 దిర్హామ్ల జరీమానా
- October 11, 2018షార్జా: ఇల్లీగల్ కార్ వాష్కిగాను 500 దిర్హామ్ల జరీమానా విధిస్తున్నట్లు షార్జా మునిసిపాలిటీ వర్గాలు వెల్లడించాయి. పబ్లిక్ ప్రాంతాల్లో, స్ట్రీట్స్పైనా, రెసిడెన్షియల్ ఏరియాస్లోనూ ఇల్లీగల్ కార్ వాష్ చేయించినందుకుగాను మొత్తం 681 మంది కార్ ఓనర్లకు గత క్వార్టర్లో జరీమానాలు విధించారు. ఇల్లీగల్ కార్ వాషింగ్కి 250 నుంచి 500 దిర్హామ్ల వరకు జరీమానా విధించేందుకు చట్టం వీలు కల్పిస్తోంది. వాచ్మెన్, ఇల్లీగల్ వర్కర్స్, ఇతరులు సాయంత్రం వేళల్లో భవనాల వద్ద, ఇతర పబ్లిక్ ప్రాంతాల్లో కార్లను వాష్ చేస్తున్నారని ఇన్స్పెక్షన్ టీమ్స్ గుర్తించాయి. ఈ నేపథ్యంలో తనిఖీల్ని మరింత ముమ్మరం చేసి, ఉల్లంఘనులపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ముబారక్ అల్-కబీర్ను కలిసిన భారత రాయబారి
- ఖతార్లో ఆహార భద్రతపై మంత్రిత్వ శాఖ క్లారిటీ
- యూఏఈలో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ..!
- ఈ రోజుల్లో ఒమానీలకు ఉచిత బస్సు సేవలు
- పీక్ అవర్స్ కోసం దుబాయ్ మెట్రో కొత్త ప్రోటోకాల్స్
- టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల..
- మీ వాట్సాప్ గ్రీన్ కలర్లోకి మారిందా?
- టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును ప్రకటించిన BCCI
- మే నెలలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- విద్యార్థులపై లైంగిక వేధింపులు.. టీచర్కు 15 ఏళ్ల జైలుశిక్ష