దుబాయ్ ఎయిర్ పోర్ట్స్.. పాస్పోర్ట్ లేకుండానే
- October 11, 2018దుబాయ్: దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్స్ మీదుగా ప్రయాణించే ఫస్ట్ క్లాస్ మరియు బిజినెస్ క్లాస్ ప్రయాణీకులు పాస్పోర్ట్ లేకుండానే తమ ప్రయాణాల్ని ఎంజాయ్ చేయొచ్చు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ మరియు ఫారిన్ ఎఫైర్స్ (జిడిఆర్ఎఫ్ఎ) - దుబాయ్, దుబాయ్ ఎయిర్ పోర్ట్ 3వ టెర్మినల్ వద్ద స్మార్ట్ టన్నెల్ని ఏర్పాటు చేసింది. కేవలం 15 సెకెన్లలో పాస్పోర్ట్ కంట్రోల్ ప్రొసిడ్యూర్స్ని పూర్తి చేసే అవకాశం ఈ కొత్త విధానం కల్పిస్తోంది. పాస్పోర్టులపై స్టాంప్ అవసరం లేకుండా బయోమెట్రిక్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా ప్రయాణీకులు ఈ స్మార్ట్ టన్నెల్లో వెళ్ళొచ్చు. టన్నెల్, ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీతో పనిచేస్తుంది. కేవలం 15 నిమిషాల్లోనే హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా పని పూర్తి చేస్తుంది టన్నెల్. జిడిఆర్ఎఫ్ఎ డైరెక్టర్ మేజర్ జనరల్ మొహమ్మద్ అహ్మద్ అల్ మర్రి మాట్లాడుతూ, ఇది ప్రస్తుతానికి ట్రయల్ ఫేజ్లో వుందనీ, ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్ యూఏఈ, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ మక్తౌమ్ ఈ స్మార్ట్ విధానాన్ని త్వరలో ప్రారంభించబోతున్నారనీ చెప్పారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం