బ్రిటన్‌:వలసదారులపై హెల్త్ సర్‌చార్జీ పెంపు

- October 14, 2018 , by Maagulf
బ్రిటన్‌:వలసదారులపై హెల్త్ సర్‌చార్జీ పెంపు

బ్రిటన్:యూరోపియన్‌ యూనియన్‌ బయటి దేశాల నుంచి బ్రిటన్‌కు వచ్చే వలసదారులపై విధించే హెల్త్‌ సర్‌చార్జీని ఆ దేశం రెండింతలు చేయనుంది. దీంతో భారత్‌ సహా పలు దేశాల నుంచి బ్రిటన్‌కు వెళ్లే పౌరులు, విద్యార్థులు, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు వీసా ఫీజు కింద మరింత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం వలస వీసాదారులు ఏడాదికి 200 (రూ. 19,400) పౌండ్లు, విద్యార్థి వీసా కలిగినవారు ఏడాదికి 150 (రూ. 14,540) పౌండ్లు సర్‌చార్జీ కింద చెల్లిస్తున్నారు. డిసెంబరు నుంచి అమల్లోకి రానుంది. అయితే తాజా పెంపు నుంచి యూరోపియన్‌ యూనియన్‌ దేశాల పౌరులను మినహాయించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com