రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- April 29, 2024
హైదరాబాద్: ఢిల్లీ పోలీసులు సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియోపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. మే 1వ తేదీకల్లా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. రిజర్వేషన్ల అంశం మీద అమిత్ షాపై కాంగ్రెస్ నేతలే ఫేక్ వీడియోను క్రియేట్ చేశారని బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఢిల్లీ నుంచి వచ్చిన పోలీసులు గాంధీ భవన్కు వెళ్లారు. మే 1న ఫోన్ తీసుకొని విచారణకు రావాలని పోలీసులు తెలిపారు. అమిత్ షా మార్ఫింగ్ వీడియోను రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా పోస్ట్ చేసినట్లు ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు.
రిజర్వేషన్లు రద్దు చేస్తున్నారని అమిత్ షా చెప్పినట్లుగా ఓ ఫేక్ వీడియోను కాంగ్రెస్ పార్టీ వైరల్ చేస్తోందని ఢిల్లీ, హైదరాబాద్తో పాటు పలురాష్ట్రాల్లో బీజేపీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కేసు నమోదు చేసి రేవంత్ రెడ్డికి సమన్లు జారీ చేశారు. వీడియో షేర్ చేశారంటూ పలువురు కాంగ్రెస్ నేతలకు కూడా ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. రేవంత్ రెడ్డితో పాటు పలు రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ట్విట్టర్ హ్యాండిల్స్కు నోటీసులు జారీ చేశారు.
తాజా వార్తలు
- డ్రగ్స్, సైబర్ క్రైమ్ నియంత్రణపై సమగ్ర ప్రణాళికలు రూపొందించాలి: సీఎం రేవంత్
- బెంగళూరులో శ్రీశ్రీ రవిశంకర్ 70వ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- షార్జా: ఈద్ అల్ అధా సందర్భంగా విడుదల కానున్న 227 మంది ఖైదీలు
- ఈద్ అల్ అధా ముందు మే నెల జీతాలు చెల్లించాలి: కార్మిక శాఖ ఆదేశాలు
- ఈద్ అల్ అధా సందర్భంగా విడుదల కాబోతున్న 956 మంది ఖైదీలు
- హర్ముజ్ జలసంధికి చెక్..
- సౌదీలో 20 ఏళ్ల కష్టజీవితం అనంతరం స్వదేశానికి చేరనున్న ఏపీ వాసి
- స్టాలిన్ జోస్యం తో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్న సీఎం విజయ్
- లోక్ భవన్లో తెలంగాణ గవర్నర్ను కలిసిన డీజీపీ సి.వి. ఆనంద్
- ఇటలీ తో సంబంధం..అంతకుమించి: ప్రధాని మోదీ









