సోమాలియాలో ఆత్మాహుతి దాడులు, 14 మంది మృతి
- October 14, 2018
సోమాలియాలోని బైడొ నగరంలో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. స్థానిక బిలాన్ హోటల్, బద్రి రెస్టారెంటు లక్ష్యంగా ఇద్దరు ముష్కరులు తమను తాము పేల్చేసుకున్నారు. ఈ దాడుల్లో 14 మంది చనిపోగా .. మరో 20 మందికి గాయాలయ్యాయి. ఈ ఆత్మాహుతి దాడులకు తామే కారణమని ఉగ్రవాద సంస్థ అల్-షబాబ్ ప్రకటన విడుదల చేసింది. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించినట్లు స్థానిక మంత్రి ఉగాస్ హాసన్ ఇబ్రహీం వెల్లడించారు.
గత మూడు దశాబ్దాలుగా హింస, అభద్రత, రాజకీయ సంక్షోభం వల్ల సోమాలియా అతలాకుతలం అవుతోంది. ఆఫ్రికన్ శాంతి పరిరక్షక దళాల సంఘాల జోక్యంతో ప్రభుత్వంలో ఏర్పడ్డ అంతర్గత విభేదాలు, వివిధ రకాల ఉగ్రవాద సంస్థలు ఇప్పటికే సోమాలియాలో వేలాది మంది పౌరులను పొట్టనబెట్టుకున్నాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







