సోమాలియాలో ఆత్మాహుతి దాడులు, 14 మంది మృతి
- October 14, 2018సోమాలియాలోని బైడొ నగరంలో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. స్థానిక బిలాన్ హోటల్, బద్రి రెస్టారెంటు లక్ష్యంగా ఇద్దరు ముష్కరులు తమను తాము పేల్చేసుకున్నారు. ఈ దాడుల్లో 14 మంది చనిపోగా .. మరో 20 మందికి గాయాలయ్యాయి. ఈ ఆత్మాహుతి దాడులకు తామే కారణమని ఉగ్రవాద సంస్థ అల్-షబాబ్ ప్రకటన విడుదల చేసింది. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించినట్లు స్థానిక మంత్రి ఉగాస్ హాసన్ ఇబ్రహీం వెల్లడించారు.
గత మూడు దశాబ్దాలుగా హింస, అభద్రత, రాజకీయ సంక్షోభం వల్ల సోమాలియా అతలాకుతలం అవుతోంది. ఆఫ్రికన్ శాంతి పరిరక్షక దళాల సంఘాల జోక్యంతో ప్రభుత్వంలో ఏర్పడ్డ అంతర్గత విభేదాలు, వివిధ రకాల ఉగ్రవాద సంస్థలు ఇప్పటికే సోమాలియాలో వేలాది మంది పౌరులను పొట్టనబెట్టుకున్నాయి.
తాజా వార్తలు
- కువైట్ ఆర్మీ జనరల్ స్టాఫ్ చీఫ్ని కలిసిన భారత రాయబారి
- Dh3 మిలియన్ల వరకు జరిమానా: CSI చర్చి, BAPS ఆలయాన్ని సందర్శిస్తున్నారా?
- SR808 బిలియన్లకు చేరిన FDI పెట్టుబడులు..!
- ఖతార్ ఎయిర్వేస్ మొట్టమొదటి AI క్యాబిన్ సిబ్బంది..!
- వెబ్సైట్లలో వ్యక్తిగత డేటా షేర్.. ROP హెచ్చరికలు
- UNHCR కోసం ఖతార్ ఎయిర్వేస్ ఉదారత..!
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!