ఆటో డ్రైవర్ అకౌంట్లోకి రూ. 300 కోట్లు..
- October 14, 2018పాకిస్థాన్:ఆటో డ్రైవర్ ఖాతాలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 300 వందల కోట్ల రూపాయలు లావాదేవీలు జరిగాయి. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ఈ ఘటన పాకిస్థాన్ లో చోటుచేసుకుంది. కరాచీ పట్టణానికి చెందిన ముహమ్మద్ రషీద్ ఆటో డ్రైవింగ్ చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే ఇటీవల రషీద్ బ్యాంకు అకౌంట్ నుంచి రూ.300 కోట్ల లావాదేవీలు జరిగినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. దాంతో వెంటనే రషీద్ను అదుపులోకి తీసుకుని ఇంతమొత్తంలో నగదు లావాదేవీలు ఎలా జరిగాయన్న దానిపై ఆరాతీశారు. దానికి రషీద్ తన ఖాతాలోకి అంత డబ్బు ఎలా వచ్చిందో తెలియదని సమాధానం చెప్పాడు. ఇంటి అద్దె కట్టలేని రషీద్.. తన అకౌంట్ ద్వారా ఇంత పెద్ద మొత్తంలో లావాదేలు జరగడంతో ఆశ్చర్యంలో మునిగిపోయాడు. అయితే ఈ బ్యాంకు ఖాతాని 2005లో ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేసేటప్పుడు ఆ కంపెనీ వారు ఓపెన్ చేశారని.. తన జీతం డబ్బులు అందులో వేసేవారని. కొద్ది నెలల తర్వాత తాను ఆ ఉద్యోగం మానేసి ఆటో తోలుకుంటున్నాని అన్నాడు. తన జీవితంలో ఇంత వరకు లక్ష రూపాయలు కూడా చూడలేదు.. అలాంటిది మూడువందల కోట్ల రూపాయలు నా అకౌంట్లో ఉందనడం నా ఊహకు కూడా అందని విషయం. అంటూ నిరాశగా వెల్లడించాడు రషీద్. కాగా ఆ డబ్బు ఎవరి అకౌంట్ లోనుంచి ఎవరికీ చేరిందన్న దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం