'2.0' చిత్రం నుండి లిరికల్ వీడియోలు విడుదల
- October 20, 2018స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన క్రేజీ ప్రాజెక్ట్ 2.ఓ. నవంబర్ 29న విడుదల కానున్న ఈ చిత్ర టీజర్ వినాయక చవితి శుభాకాంక్షలతో విడుదల కాగా, ఈ టీజర్ 24 గంటలలో 32 మిలియన్స్కి పైగా వ్యూస్ రాబట్టి అందరికి షాక్ ఇచ్చింది. విజువల్ ఎఫెక్ట్స్ మాయాజాలం అందరిని అబ్బురపరచగా, చివరలో రజనీ స్పెడ్స్ని పైకి ఎత్తి కుకూ అంటూ చెప్పే డైలాగ్ అభిమానులు ఉర్రూతలూగేలా చేసింది. ఈ చిత్రం కోసం 1000 మంది వీఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్స్ పని చేయగా, కాన్సెప్ట్ ఆర్టిస్టులు 10, 3డీ డిజైనర్స్ 25 మంది, క్రాఫ్ట్స్ మాన్ 500 మంది పని చేశారు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, అమీజాక్సన్లు చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు. దాదాపు 545 కోట్ల బడ్జెట్తో ఈ చిత్రాన్ని రూపొందించింది లైకా సంస్థ. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ జోరు పెంచుతుంది. తాజాగా రెండు లిరికల్ సాంగ్ వీడియోలని విడుదల చేసింది మూవీ టీం. ఎందిర లోగొత్తు సుందరియ, రాజాలి అంటూ సాగే ఈ పాటలకి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఏఆర్ రెహమాన్ స్వరపరచిన బాణీలకి ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం