మూడింటినీ కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది..రాహుల్
- October 20, 2018తెలంగాణలో రాహుల్ సమరభేరి మోగించారు. మొదట బైంసా, తరువాత కామారెడ్డి సభలతో కాంగ్రెస్ కేడర్లో జోష్ నింపారు. ముఖ్యంగా కామారెడ్డి బహిరంగ సభలో మాట్లాడిన రాహుల్.. కేసీఆర్, మోడీ పాలనపై నిప్పులు చెరిగారు. ఇద్దరూ అవినీతిలో పోటీ పడుతున్నారని మండిపడ్డారు.
నీళ్లు, నిధులు, నియామకాలపై నడిచిన ఉద్యమంతోనే తెలంగాణ ఏర్పాటైందని రాహుల్ అభిప్రాయపడ్డారు. కానీ ఆ మూడింటినీ కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. దాదాపు ఐదేళ్ల పాలనలో కేసీఆర్ అవినీతికి పాల్పడి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను మంటగలిపారని రాహుల్ మండిపడ్డారు.
ప్రాజెక్టుల రీ డిజైన్లో తీవ్ర అనివీతి జరిగిందని రాహుల్ విమర్శించారు. అంబేద్కర్ ప్రాణిహిత పేరు మార్చి ఆయనను అవమానించారన్నారు. కేవలం ప్రాజెక్టుల పేరు మార్చి.. కోట్లు కొల్లగొట్టారని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులను కేసీఆర్ ప్రభుత్వం మోసం చేస్తోందని రాహుల్ ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో రైతులది కీలక పాత్ర అని గుర్తు చేశారు. కానీ రాష్ట్రం కోసం పోరాటం చేసిన రైతులకు కేసీఆర్ బేడీలు వేయించారని రాహుల్ మండిపడ్డారు.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం