మహేష్ హీరోయిన్ ని పరామర్శించిన నమ్రత
- November 01, 2018బాలీవుడ్ నటి సోనాలీ బింద్రే తెలుగులో మహేష్ బాబు సరసన మురారీ సినిమాలో నటించింది. ఆ అభిమానంతోనే క్యాన్సర్తో పోరాడుతూ న్యూయార్క్లో చికిత్స పొందుతున్న సోనాలీని చూడడానికి మహేష్ బాబు భార్య నమ్రత వెళ్లింది. వివాహం చేసుకున్న తరువాత సిల్వర్ స్క్రీన్కు దూరమైన సోనాలీకి ఒక బాబు ఉన్నాడు. గత కొంత కాలంగా హైగ్రేడ్ క్యాన్సర్ బాధపడుతోంది. ఈ విషయాన్ని సోనాలీ జులైలో తనే స్వయంగా ప్రకటించింది.
అప్పటి నుంచి చికిత్స తీసుకుంటోంది. చికిత్సలో భాగంగా కీమో థెరపీ చేయించుకుంటున్న సమయంలో జుట్టంతా రాలిపోతుంది. గుండుతో ఉండాల్సి వచ్చినా ఏ మాత్రం ఇబ్బంది పడకుండా దాన్ని కూడా సంతోషంగానే స్వీకరించింది. ధైర్యంగా ఉన్నానంటూ అభిమానులకోసం ఆ ఫోటోలను షేర్ చేసింది. ఇప్పటికే ఆమెను బాలీవుడ్ సెలబ్రెటీలు చాలామంది పలకరించారు.
తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ కూడా సోనాలీని కలిసి వచ్చారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించారు. సోనాలి గురిచి చెబుతూ.. తనకి ధైర్యం చాలా ఎక్కువని, క్యాన్సర్ బారి నుంచి కోలుకుంటోందని అన్నారు.
త్వరలో సాధారణ జీవితం గడపనుంది అని నమ్రత తెలిపింది. ఆమెతో గడిపిన కొద్ది సమయం చాలా సంతోషంగా అనిపించిందని, చాలా విషయాలు చర్చించుకున్నామని వివరించింది. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థన చేస్తానని తెలిపింది.
తాజా వార్తలు
- IELTS కు బహ్రెయిన్ విద్యార్థులు ఆసక్తి..!
- రియాద్లో మొదటి ఈయూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రారంభం
- మోటార్సైకిల్కు నిప్పంటించిన ముగ్గురు అరెస్టు
- 2024 చివరి నాటికి యూనిఫైడ్ GCC టూరిస్ట్ వీసా
- యూఏఈలో ICSE, ISC ఫలితాలు విడుదల
- హట్టా పర్వతాల నుండి బ్రిటిష్ హైకర్ ఎయిర్ లిఫ్ట్
- అహ్మదీ గవర్నర్ను కలిసిన భారత రాయబారి
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…