ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- May 06, 2024
సౌదీ అరేబియా: భారత స్టార్ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మనిక బాత్రా సంచలనం సృష్టించింది. సౌదీ స్మాష్-2024 టీటీ టోర్నీలో ప్రపంచ రెండో ర్యాంకర్, ఒలింపిక్ చాంపియన్ వాంగ్ మాన్యు (చైనా)కు మనిక బాత్రా షాకిచ్చింది. సోమవారం ఇక్కడ జరిగిన రౌండ్-32లో ప్రపంచ 39వ ర్యాంకర్ బాత్రా 3-1 (6-11, 11-5, 11-7, 12-10) తేడాతో చైనా స్టార్ వాంగ్పై సంచలన విజయం సాధించి ప్రీ క్వార్టర్ ఫైనల్స్లో దూసుకెళ్లింది.
తొలి గేమ్ను కోల్పోయిన మనిక తర్వాత అనూహ్యంగా పుంజుకొని వరుస విజయాలతో 37 నిమిషాల్లోనే చైనా ప్రత్యర్థిని చిత్తు చేసింది. ఇక తర్వాతి మ్యాచ్లో బాత్రా జర్మనీకు చెందిన నినా మిత్తెల్హామ్తో ఢీ కొననుంది. మరోవైపు మిక్స్డ్ డబుల్స్లో హర్మిత్ దేశాయ్-యశస్విని జంట క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించింది. ప్రీ క్వార్టర్స్లో హర్మిత్-యశస్విని జోడీ 3-2 (11-5, 5-11, 3-11, 11-7, 11-7) తేడాతో ఐదో సీడ్ స్పానిష్ జంట అల్వారొ రొబ్లెస్-మారియా జియావ్లను ఓడించి టోర్నీలో ముందంజ వేశారు.
తాజా వార్తలు
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్లో సరికొత్త AI ఫీచర్లు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!









