సైక్లిస్ట్పై దాడి, దోపిడీ
- November 05, 2018షార్జా క్రిమినల్ కోర్టులో ఆసియాకి చెందిన ఓ వ్యక్తిపై దాడి, దొంగతనం అభియోగాలు నమోదయ్యాయి. నిందితుడు, ఓ సైక్లిస్ట్పై దాడి చేసి 10,000 దిర్హామ్లను దోచుకున్నట్లు అభియోగాల్లో పేర్కొన్నారు. షార్జాలోని సజా ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ ఘటన జరిగింది. ఇద్దరు వ్యక్తులతో కలిసి నిందితుడు ఈ దాడికి పాల్పడ్డాడు. సాయంత్రం 7 గంటల సమయంలో సజా ఇండస్ట్రియల్ ఏరియా ప్రాంతంలో తాను సైకిల్పై వెళుతుండగా, ముగ్గురు వ్యక్తులు తనను ఆపి, దారి చూపించమని అడిగారనీ, అంతలోనే వారు తనపై దాడికి దిగి, దోచుకున్నారని బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కత్తితో బెదిరించి దాడి చేసినట్లు నిందితులపై అభియోగాలు మోపబడ్డాయి. అయితే న్యాయస్థానంలో నిందితులు మాత్రం తామెలాంటి దాడికి పాల్పడలేదని అంటున్నారు. కేసు విచారణ నవంబర్ 28వ తేదీకి వాయిదా పడింది.
తాజా వార్తలు
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!
- QR247 మిలియన్లు తిరిగి చెల్లించాలని సీఈఓను ఆదేశించిన కోర్టు
- 2023లో 99%కి చేరుకున్న సౌదీ ఇంటర్నెట్ వినియోగం
- మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం.. అగ్రస్థానంలో భారతీయులు
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ సీజన్..మరో 3 రోజులు పొడిగింపు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం