ఓటరు నమోదుకు ఇక ఐదు రోజులే గడువు
- November 05, 2018
తెలంగాణ:ఓటరు నమోదుకు ఇంకా ఐదు రోజులే మాత్రమే గడువు ఉంది. నవంబర్ 9వ తేదీన ఓటరు నమోదుకు చివరి తేదీగా ప్రకటించారు. 2018 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలి. ఒక వేళ ఓటరుగా నమోదు కాకుంటే వెంటనే సమీపంలోని వార్డు కార్యాలయం, గ్రామ పంచాయితీ, బూత్లెవల్ ఆఫీసర్ వద్ద ఫారం-6ని తీసుకొని ఓటరుగా నమోదు చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో 2018 డిసెంబర్ 7వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఈ ఎన్నికలలో ఓటు వేయాలంటే ఈ నెల 9వ తేదీలోపు ఓటరుగా నమోదై ఉండాలి. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకుని డిసెంబర్ 7న జరిగే ఓటింగ్లో పాల్గొనాలని ఎన్నికల అధికారులు సూచించారు. కార్డు ఉన్నప్పటికీ తుది జాబితాలో ఓటులేని వ్యక్తులు కూడా ఫారం-6 ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







