ఓటరు నమోదుకు ఇక ఐదు రోజులే గడువు
- November 05, 2018తెలంగాణ:ఓటరు నమోదుకు ఇంకా ఐదు రోజులే మాత్రమే గడువు ఉంది. నవంబర్ 9వ తేదీన ఓటరు నమోదుకు చివరి తేదీగా ప్రకటించారు. 2018 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలి. ఒక వేళ ఓటరుగా నమోదు కాకుంటే వెంటనే సమీపంలోని వార్డు కార్యాలయం, గ్రామ పంచాయితీ, బూత్లెవల్ ఆఫీసర్ వద్ద ఫారం-6ని తీసుకొని ఓటరుగా నమోదు చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో 2018 డిసెంబర్ 7వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఈ ఎన్నికలలో ఓటు వేయాలంటే ఈ నెల 9వ తేదీలోపు ఓటరుగా నమోదై ఉండాలి. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకుని డిసెంబర్ 7న జరిగే ఓటింగ్లో పాల్గొనాలని ఎన్నికల అధికారులు సూచించారు. కార్డు ఉన్నప్పటికీ తుది జాబితాలో ఓటులేని వ్యక్తులు కూడా ఫారం-6 ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?