ఛారిటీ రన్లో 3 వేల మంది..
- November 10, 2018బహ్రెయిన్:పలు రకాల ఛారిటీ ప్రోగ్రామ్స్ కోసం 50,000 బహ్రెయినీ దినార్స్ సేకరించేందుకుగాను నిర్వహించిన మారథాన్లో 3 వేల మంది రన్నర్స్, 200 టీమ్లుగా పార్టిసిపేట్ చేశారు. 37వ ఎడిషన్ బహ్రెయిన్ మారథాన్ రిలే, బహ్రెయిన్ రౌండ్ టేబుల్ మరియు రోటరాక్ట్ బహ్రెయిన్ నిర్వహణలో జరిగింది. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ వద్ద ఈ ఈవెంట్ని నిర్వహించారు. బిఎంఆర్ 2018 ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్ హిషాంగ్ కెవల్రామ్ మాట్లాడుతూ, బహ్రెయిన్ మారథాన్ రిలేలో పెద్ద యెత్తున పార్టిసిపెంట్స్ పాల్గొన్నారని తెలిపారు. తాజా ఈవెంట్ బహ్రెయిన్లోనే అతి పెద్ద ఛారిటీ ఈవెంట్గా రికార్డులకెక్కిందని నిర్వాహకులు తెలిపారు. ఈ ఈవెంట్ ద్వారా మొత్తంగా 50,000 బహ్రెయినీ దినార్స్ నిధుల్ని సమీకరించారు. పలు రకాలైనా సేవా కార్యక్రమాల కోసం ఈ నిధుల్ని వెచ్చిస్తారు.
తాజా వార్తలు
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం