సోషల్ మీడియా అకౌంట్స్పై దుబాయ్ పోలీస్ వార్నింగ్
- November 12, 2018ఓ వ్యక్తి సోషల్ మీడియాలో తనను తాను ప్రముఖుడిగా పరిచయం చేసుకుని, ఓ వృద్ధురాలి నుంచి డబ్బుని లాగేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయనీ, సోషల్ మీడియాలో ఇలాంటి అపరిచిత వ్యక్తుల్ని నమ్మి మోసపోకూడదని దుబాయ్ పోలీస్ అప్రమత్తం చేసింది. స్కామర్స్కి సోషల్ మీడియా చాలా బాగా ఉపయోగపడ్తోందనీ, అపరిచిత వ్యక్తులు చెప్పే తియ్యటి మాటలు అమాయకుల్ని నిండా ముంచేస్తున్నాయని పోలీసులు చెప్పారు. అపరిచిత వ్యక్తులకు సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియాలో కనుగొనగానే తమను సంప్రదించాలని దుబాయ్ పోలీసులు అంటున్నారు. సైబర్ క్రైమ్స్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ సలీమ్ బిన్ సల్మీన్ మాట్లాడుతూ, సోషల్ మీడియా వినియోగదారులు అనుక్షణం అప్రమత్తంగా వుండాలని సూచించారు. ప్రలోభాలకు, బెదిరింపులకు లొంగరాదనీ, పోలీసులను సంప్రదించి అక్రమార్కుల సమాచారం తెలియజేయాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
తాజా వార్తలు
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం