దీప్వీర్ పెళ్లి ఫొటోల కోసం వేచి చూస్తే అస్థి పంజరం అవుతారు!
- November 15, 2018బాలీవుడ్ ప్రేమజంట దీపికా పదుకొనె - రణ్వీర్ సింగ్ వివాహం ఇటలీలోని లేక్ కోమోలో అంగరంగ వైభవంగా జరిగింది. మొదట నిశ్చితార్థ వేడుక అనంతరం వివాహం జరిగింది. వరుడు రణ్వీర్ సీప్లేన్లో మండపానికి వచ్చాడు. దీపిక ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సవ్యసాచి డిజైన్ చేసిన చీరను ధరించిందనట్టు తెలిసింది. పెళ్లికి సంబంధించిన ఫోటోలు బయటకు వెళ్లకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకొన్నారు. ఈ నేపథ్యంలో దీప్ రణ్ పెళ్లి ఫోటోల కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ కూడా ఈ వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. ఆ విషయం తెలియజేస్తూ.. ఆసక్తికరమైన ట్విట్ చేశారు స్మృతీ. 'దీప్వీర్ పెళ్లి ఫొటోల కోసం చాలా సేపటి వరకు ఎదురుచూసినప్పుడు ఇలాగే ఉంటుంది' అంటూ ఓ బల్లపై కూర్చున్న అస్తిపంజరం ఫోటోను పోస్టు చేశారు. ఇప్పుడీ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శుభమా అని పెళ్లి చేసుకొంటుంటే.. ఈ అస్థిపంజరం ఏంటీ మంత్రి గారూ.. !! అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!