చాల్లేదు.. ఇంకా కావాలి: విమానంలో మహిళ రచ్చ
- November 15, 2018
ఎవరన్నారు బాస్.. మహిళలు మగవారికంటే తక్కువని.. ఎందులోనూ తక్కువ కాదు.. మళ్లీ మాట్లాడితే రెండాకులు ఎక్కువే.. వారికైతే అడిగినంత పోస్తారు.. మాకు మాత్రం ఎందుకివ్వరు.. మద్యం మత్తు నషాళానికి ఎక్కినా మరికొంత కావాలంటూ అసభ్య పదజాలంతో విమాన సిబ్బందిని దూషించింది ఓ నవ నాగరికురాలు.
అప్పటికే మోతాదుకు మించి మద్యాన్ని సేవించి ఉన్న ఐరిష్ మహిళ ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్ విమానంలో ప్రయాణిస్తోంది. సిబ్బంది ఈ విషయాన్ని గుర్తించి క్యాబిన్ క్రూ కమాండర్కు ఫిర్యాదు చేశారు. ఇంకోసారి ఆమె మద్యం అడిగితే అస్సలు ఇవ్వొద్దని కమాండర్ సూచించారు.
అదే విషయం ఆమెకు చెప్పడంతో కోపంతో రగిలిపోయింది. తీవ్రపదజాలంతో సిబ్బందిని దూషించింది. పైలట్ వద్దకు వచ్చి అతని మీద ఉమ్మి వేసింది. ఆమె అంత చేస్తున్నా పైలట్ ఏమాత్రం కోప్పడలేదు. ఇంతకీ ఆమె ఎవరూ అని ఆరా తీస్తే ఓ
ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ విభాగంలో లాయర్ అని తెలుసుకున్నారు విమాన సిబ్బంది.
బ్రిటన్కు చెందిన ఈ 50 ఏళ్ల లాయరమ్మ ఈనెల 10న ముంబై నుంచి లండన్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానం ఎక్కింది. తనను తాను ఓ లాయర్ అని విమాన సిబ్బందిని పరిచయం చేసుకుంది. కొద్దిసేపటి తరువాత ఓ గ్లాస్ వైన్ కావాలని అడిగింది. అది తాగేసి మరో గ్లాస్ కావాలని కోరింది.
దీనికి సిబ్బంది నిరాకరించడంతో వారిని దుర్భాషలాడింది. అంతే కాకుండా మిమ్మల్ని కోర్టుకు ఈడుస్తా, ఇండియన్స్ అయిన మీరు డబ్బుకు కక్కుర్తి పడుతున్నారని నోటికి వచ్చినట్లు మాట్లాడింది. ఎయిర్ ఇండియా యాజమాన్యం పై అధికారులకు ఫిర్యాదు చేయడంతో లండన్లోని హిత్రో విమానాశ్రయంలో ఆమెను అరెస్టు చేశారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







