చాల్లేదు.. ఇంకా కావాలి: విమానంలో మహిళ రచ్చ
- November 15, 2018
ఎవరన్నారు బాస్.. మహిళలు మగవారికంటే తక్కువని.. ఎందులోనూ తక్కువ కాదు.. మళ్లీ మాట్లాడితే రెండాకులు ఎక్కువే.. వారికైతే అడిగినంత పోస్తారు.. మాకు మాత్రం ఎందుకివ్వరు.. మద్యం మత్తు నషాళానికి ఎక్కినా మరికొంత కావాలంటూ అసభ్య పదజాలంతో విమాన సిబ్బందిని దూషించింది ఓ నవ నాగరికురాలు.
అప్పటికే మోతాదుకు మించి మద్యాన్ని సేవించి ఉన్న ఐరిష్ మహిళ ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్ విమానంలో ప్రయాణిస్తోంది. సిబ్బంది ఈ విషయాన్ని గుర్తించి క్యాబిన్ క్రూ కమాండర్కు ఫిర్యాదు చేశారు. ఇంకోసారి ఆమె మద్యం అడిగితే అస్సలు ఇవ్వొద్దని కమాండర్ సూచించారు.
అదే విషయం ఆమెకు చెప్పడంతో కోపంతో రగిలిపోయింది. తీవ్రపదజాలంతో సిబ్బందిని దూషించింది. పైలట్ వద్దకు వచ్చి అతని మీద ఉమ్మి వేసింది. ఆమె అంత చేస్తున్నా పైలట్ ఏమాత్రం కోప్పడలేదు. ఇంతకీ ఆమె ఎవరూ అని ఆరా తీస్తే ఓ
ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ విభాగంలో లాయర్ అని తెలుసుకున్నారు విమాన సిబ్బంది.
బ్రిటన్కు చెందిన ఈ 50 ఏళ్ల లాయరమ్మ ఈనెల 10న ముంబై నుంచి లండన్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానం ఎక్కింది. తనను తాను ఓ లాయర్ అని విమాన సిబ్బందిని పరిచయం చేసుకుంది. కొద్దిసేపటి తరువాత ఓ గ్లాస్ వైన్ కావాలని అడిగింది. అది తాగేసి మరో గ్లాస్ కావాలని కోరింది.
దీనికి సిబ్బంది నిరాకరించడంతో వారిని దుర్భాషలాడింది. అంతే కాకుండా మిమ్మల్ని కోర్టుకు ఈడుస్తా, ఇండియన్స్ అయిన మీరు డబ్బుకు కక్కుర్తి పడుతున్నారని నోటికి వచ్చినట్లు మాట్లాడింది. ఎయిర్ ఇండియా యాజమాన్యం పై అధికారులకు ఫిర్యాదు చేయడంతో లండన్లోని హిత్రో విమానాశ్రయంలో ఆమెను అరెస్టు చేశారు.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







