దీప్వీర్ పెళ్లి ఫొటోల కోసం వేచి చూస్తే అస్థి పంజరం అవుతారు!
- November 15, 2018బాలీవుడ్ ప్రేమజంట దీపికా పదుకొనె - రణ్వీర్ సింగ్ వివాహం ఇటలీలోని లేక్ కోమోలో అంగరంగ వైభవంగా జరిగింది. మొదట నిశ్చితార్థ వేడుక అనంతరం వివాహం జరిగింది. వరుడు రణ్వీర్ సీప్లేన్లో మండపానికి వచ్చాడు. దీపిక ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సవ్యసాచి డిజైన్ చేసిన చీరను ధరించిందనట్టు తెలిసింది. పెళ్లికి సంబంధించిన ఫోటోలు బయటకు వెళ్లకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకొన్నారు. ఈ నేపథ్యంలో దీప్ రణ్ పెళ్లి ఫోటోల కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ కూడా ఈ వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. ఆ విషయం తెలియజేస్తూ.. ఆసక్తికరమైన ట్విట్ చేశారు స్మృతీ. 'దీప్వీర్ పెళ్లి ఫొటోల కోసం చాలా సేపటి వరకు ఎదురుచూసినప్పుడు ఇలాగే ఉంటుంది' అంటూ ఓ బల్లపై కూర్చున్న అస్తిపంజరం ఫోటోను పోస్టు చేశారు. ఇప్పుడీ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శుభమా అని పెళ్లి చేసుకొంటుంటే.. ఈ అస్థిపంజరం ఏంటీ మంత్రి గారూ.. !! అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు