ప్లేఆఫ్స్కు చేరిన హైదరాబాద్..
- May 17, 2024
హైదరాబాద్: గత కొన్ని సీజన్లుగా పేలవ ప్రదర్శనతో తీవ్ర విమర్శల పాలైన సన్రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్లో అదరగొడుతోంది. కొత్త కెప్టెన్ పాట్ కమిన్స్ నేతృత్వంలోని సన్రైజర్స్ ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తూ ఈ సీజన్లో ప్లే ఆఫ్స్కు దూసుకువెళ్లింది. గురువారం ఉప్పల్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో సన్రైజర్స్ తలపడాల్సి ఉండగా ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. దీంతో ఇరు జట్లకు అంపైర్లు చెరో పాయింట్ను కేటాయించారు. 15 పాయింట్లతో సన్రైజర్స్ ఈ సీజన్లో ప్లేఆఫ్స్లో అడుగుపెట్టిన మూడో జట్టుగా నిలిచింది.
చాన్నాళ్ల తరువాత ప్లే ఆఫ్స్లో హైదరాబాద్ అడుగుపెట్టడంతో జట్టు యజమాని కావ్యా మారన్ పట్టరాని సంతోషంలో మునిగిపోయింది. వేలంలో తాను కొనుగోలు చేసిన ఆటగాళ్లు అద్భుతంగా రాణించి ప్లే ఆఫ్స్కు చేర్చడంతో సంబరాల్లో మునిగిపోయింది.
ఈ సంతోష సమయంలో ఓ అనుకొని అతిథి కావ్యా మారన్ వద్దకు వచ్చాడు. అతడి చూసిన ఆమె ఎంతో ఆప్యాయంగా పలకరించడమే కాదు కౌగిలించుకుంది. అతడు మరెవరో కాదు సన్రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
కాగా.. కేన్ మామ 2021, 2022 సీజన్లలో సన్రైజర్స్ హైదరాబాద్కు కెప్టెన్గా వ్యవహరించాడు. అతడి నాయకత్వంలో ప్లే ఆఫ్స్కు చేరడంలో విఫలం కావడం, జట్టు దారుణ ప్రదర్శన చేయడంతో సన్రైజర్స్ అతడిని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించి వేలానికి విడిచిపెట్టింది. ఈ క్రమంలో గుజరాత్ టైటాన్స్ కేన్ మామను సొంతం చేసుకుంది.
గురువారం సన్రైజర్స్, గుజరాత్ మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దు కావడం.. తన పాత జట్టు హైదరాబాద్ ప్లే ఆఫ్స్కు వెళ్లడంతో అక్కడే ఉన్న కావ్యా మారన్ ను విలియమ్సన్ వెళ్లి పలకరించాడు.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ నుంచి సురక్షితంగా స్వదేశానికి చేరుకున్న భారతీయులు
- తెలంగాణ: ఈనెల 16 నుంచి ఒంటిపూట బడులు
- ఈద్ అల్ ఫితర్..యూఏఈలో వర్షం పడుతుందా?
- 32 ఉల్లంఘనలను జారీ చేసిన కువైట్ వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- అత్యవసర సంఘటన ప్రాంతాలకు దూరంగా ఉండండి..!!
- ఖతార్ లో 6నెలలకు సరిపోయేలా నిత్యావసరాల నిల్వలు..!!
- SR1 బిలియన్ దాటిన ఎహ్సాన్ ఛారిటీ విరాళాలు..!!
- పిల్లలకు టీకాలు వేయించని పేరెంట్స్ కు Dh20,000 వరకు జరిమానా..!!
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..









