ప్లేఆఫ్స్కు చేరిన హైదరాబాద్..
- May 17, 2024
హైదరాబాద్: గత కొన్ని సీజన్లుగా పేలవ ప్రదర్శనతో తీవ్ర విమర్శల పాలైన సన్రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్లో అదరగొడుతోంది. కొత్త కెప్టెన్ పాట్ కమిన్స్ నేతృత్వంలోని సన్రైజర్స్ ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తూ ఈ సీజన్లో ప్లే ఆఫ్స్కు దూసుకువెళ్లింది. గురువారం ఉప్పల్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో సన్రైజర్స్ తలపడాల్సి ఉండగా ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. దీంతో ఇరు జట్లకు అంపైర్లు చెరో పాయింట్ను కేటాయించారు. 15 పాయింట్లతో సన్రైజర్స్ ఈ సీజన్లో ప్లేఆఫ్స్లో అడుగుపెట్టిన మూడో జట్టుగా నిలిచింది.
చాన్నాళ్ల తరువాత ప్లే ఆఫ్స్లో హైదరాబాద్ అడుగుపెట్టడంతో జట్టు యజమాని కావ్యా మారన్ పట్టరాని సంతోషంలో మునిగిపోయింది. వేలంలో తాను కొనుగోలు చేసిన ఆటగాళ్లు అద్భుతంగా రాణించి ప్లే ఆఫ్స్కు చేర్చడంతో సంబరాల్లో మునిగిపోయింది.
ఈ సంతోష సమయంలో ఓ అనుకొని అతిథి కావ్యా మారన్ వద్దకు వచ్చాడు. అతడి చూసిన ఆమె ఎంతో ఆప్యాయంగా పలకరించడమే కాదు కౌగిలించుకుంది. అతడు మరెవరో కాదు సన్రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
కాగా.. కేన్ మామ 2021, 2022 సీజన్లలో సన్రైజర్స్ హైదరాబాద్కు కెప్టెన్గా వ్యవహరించాడు. అతడి నాయకత్వంలో ప్లే ఆఫ్స్కు చేరడంలో విఫలం కావడం, జట్టు దారుణ ప్రదర్శన చేయడంతో సన్రైజర్స్ అతడిని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించి వేలానికి విడిచిపెట్టింది. ఈ క్రమంలో గుజరాత్ టైటాన్స్ కేన్ మామను సొంతం చేసుకుంది.
గురువారం సన్రైజర్స్, గుజరాత్ మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దు కావడం.. తన పాత జట్టు హైదరాబాద్ ప్లే ఆఫ్స్కు వెళ్లడంతో అక్కడే ఉన్న కావ్యా మారన్ ను విలియమ్సన్ వెళ్లి పలకరించాడు.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







