అక్క పోటీ నిర్ణయంపై ట్విట్టర్ ద్వారా స్పందించిన తమ్ముళ్లు
- November 17, 2018తెలంగాణ ఎన్నికల సందర్బంగా కూకట్ పల్లి నుంచి పోటీ చేస్తున్న నందమూరి సుహాసిని నిర్ణయంపై మొదటిసారి ఆమె ఇద్దరు తమ్ముళ్లు స్పందించారు. అక్కకోసం సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు చిన్న తమ్ముడు ఎన్టీఆర్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ఆమె పబ్లిక్ సర్వీసులో తన మొట్టమొదటి దశను తీసుకుంటుంది. ‘ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే సిద్ధాంతంతో తాతగారు సర్గీయ తారకరామారావుగారు తెలుగుదేశం పార్టీ మాకు ఎంతో పవిత్రమైనది. మా నాన్నగారు స్వర్గీయ నందమూరి హరికృష్ణ గారు సేవలందించిన తెలుగుదేశం పార్టీ తరుపున ఇప్పుడు మా సోదరి సుహాసిని గారు కూకట్ పల్లి నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న సంగతి మీకు తెలిసినదే. స్త్రీలు సమాజంలో ఉన్నతమైన పాత్రను పోషించాలి అని నమ్మే కుటుంబం మాది. ఇదే స్పూర్తితో ప్రజాసేవకు సిద్దపడుతోన్న మా సోదరి సుహాసిని గారికి విజయం వారించాలని ఆకాంక్షిస్తూ.. జై ఎన్టీఆర్, జోహార్ హరికృష్ణ .. మీ నందమూరి కళ్యాణ్ రామ్, తారకరామారావు’ అని పేర్కొంటూ ఇద్దరు అన్నదమ్ములు ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం