పంకజ్ మళ్లీ ప్రపంచ విజేత
- November 20, 2018యాంగ్వాన్ (మయన్మార్): భారత స్టార్ క్యూయిస్టు పంకజ్ అద్వానీ చరిత్ర సృష్టించాడు. పోటీకి మరోమారు ఘనంగా చాటి చెప్పాడు. ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తు చేస్తూ ఐబిఎస్ఎఫ్ బిలియర్డ్స్ చాంపియ న్షిప్ను కైవసం చేసుకుంటూ ఏకంగా 21వ సారి ప్రపంచ విజేతగా నిలిచి సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాడు. రెండు రోజుల వ్యవధిలోనే మరో ప్రపంచ టైటిల్ను ఖాతాలో వేసుకుంటు తనకు తిరుగులేదని నిరూపించాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో పంకజ్.. భారత్కు చెందిన భాస్కర్పై అలవోక విజయం సాధించాడు. రెండుసార్లు ఆసియా రజత పతక విజేత అయిన భాస్కర్ను అద్వానీ అలవోకగా ఎదుర్కొం టూ గేమ్ను దక్కించుకున్నాడు. వరుస గేముల్లో 190, 173, 198 స్కోర్లతో అద్వానీ తన దూకుడు కొనసాగించగా, భాస్కర్ మాత్రం సెంచరీ మార్క్ అందుకోవడానికి నానా కష్టాలు పడ్డాడు. తనదైన రీతిలో పాయింట్లు కొల్లగొడుతూ పంకజ్ 1000 మార్క్ను అందుకుంటే.. ప్రత్యర్థి 206కే పరిమితమై అందనంత దూరంలో ఆగిపోయాడు.గతేడాది ఇక్కడే జరిగిన ప్రపంచ స్నూకర్ చాంపియన్షిప్లో స్వర్ణం గెలిచిన ఈ దిగ్గజ క్యూయిస్టుకు బిలియర్డ్స్లో కాంస్యంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. టైటిల్ గెలిచిన అనంతరం మాట్లాడుతూ బిలియర్డ్స్లో నాలుగో గ్రాండ్ డబుల్తో ఈ ప్రపంచాన్ని జయించినట్లు ఉంది.భాస్కర్, కాజియర్, రస్సెల్ లాంటి దీటైన ప్రత్యర్థులను ఎదుర్కొవడం అంత సులువేమి కాదు. కానీ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం నమ్మశక్యంగా ఉంది. 21వ ప్రపంచ టైటిల్తో ఎంతో సంతోషంగా ఉన్నాను. ఇదే జోరును కొనసాగిస్తూ స్నూకర్ టైటిల్ను నిలబెట్టుకోవాలనుకుంటున్నాను అని పంకజ్ అన్నాడు.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్