హజ్రత్ నిజాముద్దీన్ దర్గా ప్రవేశంపై పిటిషన్ దాఖలు
- December 07, 2018న్యూఢిల్లీ : ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ ఔలియా దర్గా గర్భగుడిలోకి మహిళలను ప్రవేశానికి అనుమతినివ్వాలంటూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు వచ్చే వారం విచారణ చేపట్టే అవకాశాలు ఉన్నాయి. పుణెకు చెందిన లా మహిళ విద్యార్థులు ఈ పిటిషన్ను దాఖలు చేశారు. నవంబర్ 27న దర్గాను సందర్శించిన సమయంలో మహిళల ప్రవేశాన్ని నిరోధించే విధంగా వెలుపల ఒక నోటీసు బోర్డును ఉంచారని పిటిషన్ పేర్కొంది. ఇది రాజ్యాంగ విరుద్ధమని, దర్గాలో మహిళల ప్రవేశాన్ని నిర్దారించే మార్గదర్శకాలను రూపొందించేందుకు కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులు, దర్గా ట్రస్ట్కు ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్ కోరింది. నిజాముద్దీన్ దర్గా బహిరంగ ప్రదేశమని, లింగ బేధా ఆధారంగా ప్రవేశంపై నిషేధాజ్ఞలు విధించడం రాజ్యాంగ ముసాయిదాకి విరుద్ధమని పేర్కొంది. లా విద్యార్థుల తరుపున న్యాయవాది కమలేష్ కుమార్ మిశ్రా పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల శబరిమలలో మహిళందరికీ ప్రవేశాన్ని కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ప్రస్తావించింది. అజ్మీర్ షరీఫ్ దర్గా, హజీ అలీ దర్గాలో మహిళలను అనుమతించడాన్ని కూడా పిటిషన్ పేర్కొంది.
తాజా వార్తలు
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం