మంత్రివర్గ కూర్పుపై కేసీఆర్ దృష్టి..
- December 12, 2018తెలంగాణ:ఎన్నికల్లో భారీ మెజారిటీ రావడంతో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు మొదలు పెట్టింది టీఆర్ఎస్. రేపు ఉదయం 8గంటలకు రాజ్భవన్లో ముఖ్యమంత్రిగా కేసీఆర్, కొద్దిమంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు కేసీఆర్ గవర్నర్ను కలిసి సమాచారమిచ్చారు.
ఇవాళ ఉదయం 11న్నర గంటలకు తెలంగాణ భవన్లో TRS-LP సమావేశం జరగనుంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలంతా టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా కేసీఆర్ను ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు… మరోవైపు మంత్రివర్గ కూర్పపై కేసీఆర్ దృష్టిపెట్టారు. పలువురి పేర్లను ఆయన పరిశీలించినట్లు సమాచారం. నలుగురు మంత్రులు ఓడిపోయినందున వారి స్థానంలో కొత్తవారికి ఛాన్స్ ఇవ్వడం.. ప్రస్తుతం ఉన్నవారిలో కొందరిని మార్చే అవకాశముందని ప్రచారం జరుగుతోంది..
ప్రభుత్వం ఏర్పడ్డాక శాసనసభను ప్రత్యేకంగా సమావేశపరిచి ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయిస్తారు.. ఇందుకోసం ప్రోటెం స్పీకర్గా రెడ్యానాయక్ను నియమించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. అలాగే స్పీకర్ మధుసూదనాచారి ఓడిపోవడంతో ఆయన స్థానంలో కొత్త స్పీకర్ను ఎన్నుకోవాల్సి ఉంది.
తాజా వార్తలు
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం