డాక్టర్ల బృందానికి బ్రెజిల్ ప్రజల వీడ్కోలు
- December 12, 2018బ్రసీలియా : దాదాపు 200మంది క్యూబా డాక్టర్లు బ్రెజిల్ వీడి వెళుతుంటే బ్రెజిల్ ప్రజలు వారికి భావోద్వేగంతో కూడిన వీడ్కోలు ఇచ్చారు. 'థాంక్యూ క్యూబా' అంటూ రాసి వున్న పోస్టర్లను ప్రదర్శించారు. బ్రసీలియాలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. క్యూబా డాక్టర్ల మానవత్వం, వారి వైద్య నైపుణ్యాలు కలకాలం తాము గుర్తుంచుకుంటామని పేర్కొన్నారు. బ్రెజిల్లో ఎలాంటి వసతులు లేని చోట కూడా అద్భుతమైన సేవలందించారని పేర్కొంటూ వారి సేవలను కొనియాడారు. 'ఇదొక దుర్దినం, 6లక్షల మందికి పైగా బ్రెజిలియన్లు డాక్టర్లు లేకుండా వుండాల్సిన పరిస్థితి వస్తోంది. గత ఐదేళ్ళుగా అత్యాధునికమైన వైద్య సేవలను అందించిన క్యూబన్లకు ఇప్పుడు వీడ్కోలు పలకాల్సి వస్తోంది.' అని ప్రొఫెసర్ రొనాల్డొ ఫెరీరా వ్యాఖ్యానించారు. ఇలా డాక్టర్లు వెళ్ళిపోవడం వల్ల ముందుగా ప్రభావితమయ్యేది మారుమూల ప్రాంతాల్లోని నిరుపేద ప్రజలని అన్నారు. ఇన్నాళ్ళుగా తమతో వున్న క్యూబన్ డాక్టర్ల సేవలకు గుర్తింపుగా, వారి పట్ల గౌరవం, కృతజ్ఞతతో తాము వీడ్కోలు పలుకుతున్నామని చెప్పారు. బ్రెజిల్లో మాస్ మెడికోస్ కార్యక్రమం చాలా కీలకమైన ప్రాజెక్టు.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!