200,000 ప్రైజ్ స్కామ్: 19 మంది అరెస్ట్
- December 17, 201819 మంది సభ్యులుగల ముఠాని అజ్మన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బోగస్ క్యాష్ ప్రైజులతో అమాయకుల్ని నిందితులు మోసం చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అరెస్టయినవారంతా ఆసియాకి చెందినవారే. అజ్మన్ పోలీస్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ మొహమ్మద్ హమాద్ బిన్ యఫౌర్ అల్ ఘాఫ్లి మాట్లాడుతూ, ఓ టెలికామ్ సంస్థ నుంచి 200,000 క్యాష్ ప్రైజ్ గెలుచుకున్నట్లుగా తమకు ఫోన్లు వచ్చాయని ఫిర్యాదులు రావడంతో విచారణ చేపట్టి నిందితుల్ని అరెస్ట్ చేశామని అన్నారు. బ్యాంక్ డిటెయిల్స్ ఇస్తే, డబ్బుని జమ చేస్తామని నిందితులు కోరుతున్నారని అధికారులు తెలిపారు. పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్, అజ్మన్లో నిందితులు దాక్కున్న స్థలాన్ని గుర్తించి అరెస్ట్ చేశారు. విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం
- టీడీపీ అభ్యర్థి టీ.జీ.భరత్ నామినేషన్ దాఖలు