అందానికి తగ్గ గొప్ప మనసుందని నిరూపించిన మిస్ యూనివర్స్ 2018
- December 17, 20182018 సంవత్సరానికిగాను విశ్వసుందరిగా ఫిలిప్పిన్స్కు చెందిన భామ ఎన్నికైంది. మొత్తం 94 మంది పోటీపడగా క్యాట్రియోనో ఎలైసా గ్రే ఫైనల్ పోటీల్లో నిలిచి విజేతగా ఎంపికైంది. ఫిలిప్పిన్స్ నుంచి విశ్వసుందరిగా ఎన్నికైన నాలుగో అమ్మాయి ఎలైసా కావడం గమనార్హం.
ఈ పోటీల్లో ఎలైసాకు ఒక్క అందమే కాదు.. తెలివి తేటలు కూడా అలంకారప్రాయమయ్యాయి. ఫైనల్స్లో జడ్జీలు అడిగిన ప్రశ్న, చెప్పిన సమాధానం కూడా పస్ల్ అయ్యింది. "జీవితంలో నేర్చుకున్నగుణపాఠం ఏంటీ?, మిస్ యూనివర్స్గా ఆ సమస్యను ఎలా చూస్తారు? అనే ప్రశ్నను జడ్జిలు సంధించారు. దీనికి ఎలైసా గ్రే స్పష్టంగా సమాధానం చెప్పి జడ్జిల మనసులను గెలుచుకుంది.
"మనీలాలోని మురికివాడల్లోని చిన్నారులను చూసినప్పుడు ఎంతో బాధేసింది. వారి ముఖాల్లో చిరునవ్వును, అందాన్ని చూడాలని కోరుకుంటున్నాను. నాకు ఆ దేవుడు శక్తి ఇస్తే ఆ చిన్నారుల్లో మార్పు కోసం ప్రయత్నిస్తా. వారికి మంచి, చెడులు, విద్య అందిస్తా" అని చెప్పారు. ఈ సమాధానానికి ఫిదా అయిన జడ్జీలు ఆమెకు విజేతగా ప్రకటించారు.
కాగా, ఎలైసా గ్రే ఒక సాధారణమైన యువతి కాదు. మ్యూజిక్ థీయరీలో మాస్టర్ డిగ్రీ చేసింది. ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఫస్ట్ రన్నరప్గా సౌతాఫ్రికాకి చెందిన టామేరిన్ గ్రీన్ సెలక్ట్ అయ్యింది. సెకండ్ రన్నరప్గా వెనిజులా బ్యూటీ స్తేఫనీ నిలిచింది.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్