అందానికి తగ్గ గొప్ప మనసుందని నిరూపించిన మిస్ యూనివర్స్ 2018
- December 17, 20182018 సంవత్సరానికిగాను విశ్వసుందరిగా ఫిలిప్పిన్స్కు చెందిన భామ ఎన్నికైంది. మొత్తం 94 మంది పోటీపడగా క్యాట్రియోనో ఎలైసా గ్రే ఫైనల్ పోటీల్లో నిలిచి విజేతగా ఎంపికైంది. ఫిలిప్పిన్స్ నుంచి విశ్వసుందరిగా ఎన్నికైన నాలుగో అమ్మాయి ఎలైసా కావడం గమనార్హం.
ఈ పోటీల్లో ఎలైసాకు ఒక్క అందమే కాదు.. తెలివి తేటలు కూడా అలంకారప్రాయమయ్యాయి. ఫైనల్స్లో జడ్జీలు అడిగిన ప్రశ్న, చెప్పిన సమాధానం కూడా పస్ల్ అయ్యింది. "జీవితంలో నేర్చుకున్నగుణపాఠం ఏంటీ?, మిస్ యూనివర్స్గా ఆ సమస్యను ఎలా చూస్తారు? అనే ప్రశ్నను జడ్జిలు సంధించారు. దీనికి ఎలైసా గ్రే స్పష్టంగా సమాధానం చెప్పి జడ్జిల మనసులను గెలుచుకుంది.
"మనీలాలోని మురికివాడల్లోని చిన్నారులను చూసినప్పుడు ఎంతో బాధేసింది. వారి ముఖాల్లో చిరునవ్వును, అందాన్ని చూడాలని కోరుకుంటున్నాను. నాకు ఆ దేవుడు శక్తి ఇస్తే ఆ చిన్నారుల్లో మార్పు కోసం ప్రయత్నిస్తా. వారికి మంచి, చెడులు, విద్య అందిస్తా" అని చెప్పారు. ఈ సమాధానానికి ఫిదా అయిన జడ్జీలు ఆమెకు విజేతగా ప్రకటించారు.
కాగా, ఎలైసా గ్రే ఒక సాధారణమైన యువతి కాదు. మ్యూజిక్ థీయరీలో మాస్టర్ డిగ్రీ చేసింది. ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఫస్ట్ రన్నరప్గా సౌతాఫ్రికాకి చెందిన టామేరిన్ గ్రీన్ సెలక్ట్ అయ్యింది. సెకండ్ రన్నరప్గా వెనిజులా బ్యూటీ స్తేఫనీ నిలిచింది.
తాజా వార్తలు
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం
- కొనసాగుతున్నమూడో విడత పోలింగ్..