200,000 ప్రైజ్ స్కామ్: 19 మంది అరెస్ట్
- December 17, 2018
19 మంది సభ్యులుగల ముఠాని అజ్మన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బోగస్ క్యాష్ ప్రైజులతో అమాయకుల్ని నిందితులు మోసం చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అరెస్టయినవారంతా ఆసియాకి చెందినవారే. అజ్మన్ పోలీస్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ మొహమ్మద్ హమాద్ బిన్ యఫౌర్ అల్ ఘాఫ్లి మాట్లాడుతూ, ఓ టెలికామ్ సంస్థ నుంచి 200,000 క్యాష్ ప్రైజ్ గెలుచుకున్నట్లుగా తమకు ఫోన్లు వచ్చాయని ఫిర్యాదులు రావడంతో విచారణ చేపట్టి నిందితుల్ని అరెస్ట్ చేశామని అన్నారు. బ్యాంక్ డిటెయిల్స్ ఇస్తే, డబ్బుని జమ చేస్తామని నిందితులు కోరుతున్నారని అధికారులు తెలిపారు. పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్, అజ్మన్లో నిందితులు దాక్కున్న స్థలాన్ని గుర్తించి అరెస్ట్ చేశారు. విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు.
తాజా వార్తలు
- డిగ్రీ అడ్మిషన్ల షెడ్యూల్ మరియు ముఖ్యమైన తేదీలు!
- అందుబాటులోకి 62 గ్రామీణ అన్న క్యాంటీన్లు
- పూర్తయిన ఆశా భోంస్లే అంత్యక్రియలు..
- తెలంగాణ: ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెల్త్ ఏటీఎంలు
- ఉమ్రా వీసాల జారీ నిలిపివేత..మక్కా ప్రవేశం పై ఆంక్షలు..!!
- రిటైల్ పేమెంట్స్.. 85% వాటా ఈ-చెల్లింపులదే..!!
- అక్షయ తృతీయకు ముందు దుబాయ్లో తగ్గిన బంగారం ధరలు..!!
- తాజా పరిణామాల పై సుల్లాన్, యూకే పీఎం చర్చలు..!!
- ప్రైవేట్ సంస్థల్లో క్లాస్ రూమ్ లెర్నింగ్ తిరిగి ప్రారంభం..!!
- కువైట్ పౌరసత్వ చట్టానికి సవరణలు..గెజిట్లో పబ్లిష్..!!









